టిఎన్సీ నాగేంద్ర, సీవో  చెప్తేనే డబ్బులు వసూలు చేశా.. యానిమేటర్ హైమావతి

On

IMG-20250826-WA0019

 కడప జిల్లా కమలాపురం ఆగస్టు 26  డ్వాక్రా మహిళా సంఘాల నుంచి టీఎన్సీ నాగేంద్ర మరియు సీవో లావణ్య చెప్తేనే మహిళల నుంచి డబ్బులు వసూలు చేశానని యానిమేటర్ హైమావతి అన్నారు.తాను ఎక్కడా అవినీతికి పాల్పడలేదని పై అధికారులు డబ్బు అడిగితేనే తాను వాయిస్ మెసేజ్ చేశానన్నారు. గ్రూపు సభ్యులు డబ్బులు ఇవ్వకపోయినా ఆడిట్ అధికారులకు తన స్వంత డబ్బు రూ.28వేలు ఫోన్ ఫే చేశానన్నారు. నాపైన అసత్య ఆరోపణలు చేయడం బాధాకరంగా ఉందని వారు ఇలా చేయడంతో నిజానిజాలు చెప్పాల్సి వచ్చిందని తనతోపాటి చాలామంది యానిమేటర్లు చెప్పుకోలేక నలిగిపోతున్నారన్నారు. ఇప్పుడు ఈ నిజాలు చెప్పినందుకు తనను టీఎన్సీ నాగేంద్ర, సీవో లావణ్య ఏమంటారోనని భయంగా ఉందన్నారు. ఐదు సంవత్సరాల స్త్రీనిధి సొమ్ము అడిగితే గతం గతః అనడం సీవో లావణ్య తప్పు అన్నారు .గ్రామీణ బ్యాంకు నుంచి డీసీసీ బ్యాంకులోకి బలవంతంగా ఖాతాలు మళ్ళించడం వెనుక సీవో లావణ్య ఆంతర్యం తనకు తెలియదని బ్యాంకు అధికారులతో కూడా తమను మాట్లాడనీయకుండా లావణ్య మాత్రమే మాట్లాడుతుందని హైమావతి అన్నారు.

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

కాకులేరు వాగును పరిశీలించిన. ఎంపీడీవో గోపికృష్ణ  కాకులేరు వాగును పరిశీలించిన. ఎంపీడీవో గోపికృష్ణ 
  జూపాడుబంగ్లా అక్టోబర్29 (నంది పత్రిక) మెంధా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి వాగులు వంకలు పొంగి పొల్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు
ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షెరాన్ IPS 
అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడు అండగా ఉంటుంది
ఎండోక్రిన్ డిస్రప్టోరు పై అవగాహన కార్యక్రమం 
సబ్సిడీ వేరుశనగ విత్తనాలు మొలకెత్తలే.. అన్నదాతల ఆవేదన.! 
భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి ఘన స్వాగతం
కమిషనర్ గారు మా వార్డును సందర్శించండి.