టిఎన్సీ నాగేంద్ర, సీవో  చెప్తేనే డబ్బులు వసూలు చేశా.. యానిమేటర్ హైమావతి

On

IMG-20250826-WA0019

 కడప జిల్లా కమలాపురం ఆగస్టు 26  డ్వాక్రా మహిళా సంఘాల నుంచి టీఎన్సీ నాగేంద్ర మరియు సీవో లావణ్య చెప్తేనే మహిళల నుంచి డబ్బులు వసూలు చేశానని యానిమేటర్ హైమావతి అన్నారు.తాను ఎక్కడా అవినీతికి పాల్పడలేదని పై అధికారులు డబ్బు అడిగితేనే తాను వాయిస్ మెసేజ్ చేశానన్నారు. గ్రూపు సభ్యులు డబ్బులు ఇవ్వకపోయినా ఆడిట్ అధికారులకు తన స్వంత డబ్బు రూ.28వేలు ఫోన్ ఫే చేశానన్నారు. నాపైన అసత్య ఆరోపణలు చేయడం బాధాకరంగా ఉందని వారు ఇలా చేయడంతో నిజానిజాలు చెప్పాల్సి వచ్చిందని తనతోపాటి చాలామంది యానిమేటర్లు చెప్పుకోలేక నలిగిపోతున్నారన్నారు. ఇప్పుడు ఈ నిజాలు చెప్పినందుకు తనను టీఎన్సీ నాగేంద్ర, సీవో లావణ్య ఏమంటారోనని భయంగా ఉందన్నారు. ఐదు సంవత్సరాల స్త్రీనిధి సొమ్ము అడిగితే గతం గతః అనడం సీవో లావణ్య తప్పు అన్నారు .గ్రామీణ బ్యాంకు నుంచి డీసీసీ బ్యాంకులోకి బలవంతంగా ఖాతాలు మళ్ళించడం వెనుక సీవో లావణ్య ఆంతర్యం తనకు తెలియదని బ్యాంకు అధికారులతో కూడా తమను మాట్లాడనీయకుండా లావణ్య మాత్రమే మాట్లాడుతుందని హైమావతి అన్నారు.

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

స్టార్ న‌టి జ్యోతిక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు స్టార్ న‌టి జ్యోతిక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
హైద‌రాబాద్‌: స్టార్ న‌టి జ్యోతిక సౌత్‌పై మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. సౌత్ ఇండ‌స్ట్రీ సినిమా పోస్ట‌ర్‌ల‌లో హీరోలే ఉంటారు కానీ హీరోయిన్‌లు క‌నిపించ‌ర‌ని మండిప‌డింది. ఒక...
సూరి'కి బర్త్ డే విషెష్ చెప్పిన టాప్ హీరోయిన్.. ఫోటో వైరల్
నంద్యాల:మంత్రుల సమావేశం రద్దు-కలెక్టర్
నంద్యాల:పెన్ను క్యాప్ మీద 60 సూక్ష్మ వినాయకులు
టిఎన్సీ నాగేంద్ర, సీవో  చెప్తేనే డబ్బులు వసూలు చేశా.. యానిమేటర్ హైమావతి
పురుగు మింగి చిన్నారి మృతి
అన్నమయ్య జిల్లా  కేశాపురం హత్య కేసు చేధన – నిందితుడు అరెస్ట్.