సబ్సిడీ వేరుశనగ విత్తనాలు మొలకెత్తలే.. అన్నదాతల ఆవేదన.! 

On

IMG-20251017-WA0038

పట్టించుకోని వ్యవసాయ విస్తరణ అధికారులు 

వెల్దండ ప్రతినిధి అక్టోబర్ 17 ,: రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల రైతులకు ఇటీవల వేరుశనగ విత్తనాలు అందజేయడం జరిగింది. వివరాలలోకి వెళితే.. వెల్దండ మండల పరిధిలోని బొల్లంపల్లి గ్రామానికి చెందిన రైతు చొప్పరి శంకరయ్య 1 ఎకరం 20 గుంటల విస్తీర్ణంలో పల్లి విత్తనాలను నాటాడు. విత్తనాలను నాటీ 13 రోజులు గడుస్తున్నా.. నేటికీ మొలకెత్తక పోవడంతో రైతు రోధిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన మరో రైతు మండలి ఎల్లయ్య పరిస్థితి కూడా అలాగే వుంది. ఈ నేపథ్యంలో గ్రామంలోని మిగతా రైతులు ప్రభుత్వం అందించిన సబ్సిడీ పల్లి విత్తనాలను వేయడానికి వెనకడుగు వేస్తున్నారు. ఈ విషయంపై వ్యవసాయ విస్తరణ అధికారి శోభారాణిని ఫోన్లో సంప్రదించగా సానుకూలంగా స్పందించి ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి రైతులకు న్యాయం చేస్తామని చెప్పారు.

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

కాకులేరు వాగును పరిశీలించిన. ఎంపీడీవో గోపికృష్ణ  కాకులేరు వాగును పరిశీలించిన. ఎంపీడీవో గోపికృష్ణ 
  జూపాడుబంగ్లా అక్టోబర్29 (నంది పత్రిక) మెంధా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి వాగులు వంకలు పొంగి పొల్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు
ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షెరాన్ IPS 
అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడు అండగా ఉంటుంది
ఎండోక్రిన్ డిస్రప్టోరు పై అవగాహన కార్యక్రమం 
సబ్సిడీ వేరుశనగ విత్తనాలు మొలకెత్తలే.. అన్నదాతల ఆవేదన.! 
భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి ఘన స్వాగతం
కమిషనర్ గారు మా వార్డును సందర్శించండి.