సబ్సిడీ వేరుశనగ విత్తనాలు మొలకెత్తలే.. అన్నదాతల ఆవేదన.! 

On

IMG-20251017-WA0038

పట్టించుకోని వ్యవసాయ విస్తరణ అధికారులు 

వెల్దండ ప్రతినిధి అక్టోబర్ 17 ,: రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల రైతులకు ఇటీవల వేరుశనగ విత్తనాలు అందజేయడం జరిగింది. వివరాలలోకి వెళితే.. వెల్దండ మండల పరిధిలోని బొల్లంపల్లి గ్రామానికి చెందిన రైతు చొప్పరి శంకరయ్య 1 ఎకరం 20 గుంటల విస్తీర్ణంలో పల్లి విత్తనాలను నాటాడు. విత్తనాలను నాటీ 13 రోజులు గడుస్తున్నా.. నేటికీ మొలకెత్తక పోవడంతో రైతు రోధిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన మరో రైతు మండలి ఎల్లయ్య పరిస్థితి కూడా అలాగే వుంది. ఈ నేపథ్యంలో గ్రామంలోని మిగతా రైతులు ప్రభుత్వం అందించిన సబ్సిడీ పల్లి విత్తనాలను వేయడానికి వెనకడుగు వేస్తున్నారు. ఈ విషయంపై వ్యవసాయ విస్తరణ అధికారి శోభారాణిని ఫోన్లో సంప్రదించగా సానుకూలంగా స్పందించి ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి రైతులకు న్యాయం చేస్తామని చెప్పారు.

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

శుభకార్యాలప్పుడు ‘అన్న క్యాంటీన్ల’కు విరాళాలు ఇవ్వండి శుభకార్యాలప్పుడు ‘అన్న క్యాంటీన్ల’కు విరాళాలు ఇవ్వండి
శుభకార్యాలప్పుడు ‘అన్న క్యాంటీన్ల’కు విరాళాలు ఇవ్వండి* • పేదవారికి అన్నం పెట్టడంలో నిజమైన సంతృప్తి  • నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు  • మధ్యాహ్న భోజనానికి...
అంగరంగ వైభోగంగా శ్రీ రామకృష్ణ విద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ప్రజా సమస్యల పరిష్కార వేదిక* *వేసవి దృష్ట్యా సమయ మార్పు - ఉదయం 9:30
ట్రావెల్స్ ఏజెన్సీ టూర్ ప్యాకేజీల పేర్లతో మోసాలు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
కళారాధన ఉచిత లలిత కళల శిక్షణా శిబిరం
ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం పిఅర్టియూ మహా ధర్నా 
ఇంటర్ ఫలితాల్లో 'న్యూక్లియస్' ప్రభంజనం