విజయవంతమైన ఆయుర్వేద వైద్య శిబిరం

On

ce6090bb-5713-45ab-a6d5-ac94ed95eae8విజయవంతమైన ఆయుర్వేద వైద్య శిబిరం
శిరిగిరి వెంకప్ప పంచకర్మ  వైద్యశాల ఆధ్వర్యంలో

నంద్యాల ప్రతినిధి. ఫిబ్రవరి 12 . నంది పత్రిక :

నంద్యాల శిరిగిరి వెంకప్ప పంచకర్మ  వైద్యశాల ఆధ్వర్యంలో  నంద్యాల లయన్స్ క్లబ్ సహకారంతో గురువారం నిర్వహించిన ఉచిత ఆయుర్వేద చర్మవ్యాధుల చికిత్స మరియు ఎముకల సాంద్రత పరీక్షా శిబిరం విజయవంతమైంది.సీనియర్ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ యశోదర ధన్వంతరి చిత్రపటానికి పూలమాల వేయగా, విజయవాడ ఆయుర్వేద కళాశాల రిటైర్డ్ సూపరింటెండెంట్  డాక్టర్ పద్మనాభరెడ్డి రిబ్బన్ కత్తిరించి శిబిరాన్ని ప్రారంభించారు. శిరిగిరి రమేష్ నిర్వహణలో  జరిగిన ఈ శిబిరంలో డాక్టర్ పద్మనాభరెడ్డి, డాక్టర్ శ్రావణ సంధ్య పాల్గొని 200 మంది రోగులను పరీక్షించి, లక్ష రూపాయలు విలువగల మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు, కోశాధికారి అమిదేల జనార్ధన్, డిప్యూటీ డెమో పామన్న, పురపాలక సానిటరీ సూపర్ వైజర్ మురళీధర్ పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

విజయవంతమైన ఆయుర్వేద వైద్య శిబిరం విజయవంతమైన ఆయుర్వేద వైద్య శిబిరం
విజయవంతమైన ఆయుర్వేద వైద్య శిబిరంశిరిగిరి వెంకప్ప పంచకర్మ  వైద్యశాల ఆధ్వర్యంలో నంద్యాల ప్రతినిధి. ఫిబ్రవరి 12 . నంది పత్రిక : నంద్యాల శిరిగిరి వెంకప్ప పంచకర్మ...
సమ్మెకు ఏపీయూడబ్ల్యూజే మద్దతు.
భక్తులందరికీ ప్రశాంత మల్లన్న దర్శనం
ఆరెండ్ల అంగ వైకల్యం అమ్మాయికి జ్ఞాన నిధి సేవా సంస్థ ఆర్థిక సహాయం
నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు 
తైక్వాండో బెల్ట్ గ్రేడింగ్ పోటీలు క్రీడలు విద్యార్థులలో ఆత్మస్థైర్యం కలిగిస్తాయి
ఫిబ్రవరి 8 వ తేదీ న నంద్యాల జిల్లా స్థాయి చెస్ పోటీలు -19 సంవత్సరంలోపు బాల   బాలికలకు   ప్రత్యేక విభాగాలలో -రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లా జట్ల ఎంపిక