విజయవంతమైన ఆయుర్వేద వైద్య శిబిరం
విజయవంతమైన ఆయుర్వేద వైద్య శిబిరం
శిరిగిరి వెంకప్ప పంచకర్మ వైద్యశాల ఆధ్వర్యంలో
నంద్యాల ప్రతినిధి. ఫిబ్రవరి 12 . నంది పత్రిక :
నంద్యాల శిరిగిరి వెంకప్ప పంచకర్మ వైద్యశాల ఆధ్వర్యంలో నంద్యాల లయన్స్ క్లబ్ సహకారంతో గురువారం నిర్వహించిన ఉచిత ఆయుర్వేద చర్మవ్యాధుల చికిత్స మరియు ఎముకల సాంద్రత పరీక్షా శిబిరం విజయవంతమైంది.సీనియర్ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ యశోదర ధన్వంతరి చిత్రపటానికి పూలమాల వేయగా, విజయవాడ ఆయుర్వేద కళాశాల రిటైర్డ్ సూపరింటెండెంట్ డాక్టర్ పద్మనాభరెడ్డి రిబ్బన్ కత్తిరించి శిబిరాన్ని ప్రారంభించారు. శిరిగిరి రమేష్ నిర్వహణలో జరిగిన ఈ శిబిరంలో డాక్టర్ పద్మనాభరెడ్డి, డాక్టర్ శ్రావణ సంధ్య పాల్గొని 200 మంది రోగులను పరీక్షించి, లక్ష రూపాయలు విలువగల మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు, కోశాధికారి అమిదేల జనార్ధన్, డిప్యూటీ డెమో పామన్న, పురపాలక సానిటరీ సూపర్ వైజర్ మురళీధర్ పాల్గొన్నారు.

Comment List