విజయవంతమైన ఆయుర్వేద వైద్య శిబిరం

On

ce6090bb-5713-45ab-a6d5-ac94ed95eae8విజయవంతమైన ఆయుర్వేద వైద్య శిబిరం
శిరిగిరి వెంకప్ప పంచకర్మ  వైద్యశాల ఆధ్వర్యంలో

నంద్యాల ప్రతినిధి. ఫిబ్రవరి 12 . నంది పత్రిక :

నంద్యాల శిరిగిరి వెంకప్ప పంచకర్మ  వైద్యశాల ఆధ్వర్యంలో  నంద్యాల లయన్స్ క్లబ్ సహకారంతో గురువారం నిర్వహించిన ఉచిత ఆయుర్వేద చర్మవ్యాధుల చికిత్స మరియు ఎముకల సాంద్రత పరీక్షా శిబిరం విజయవంతమైంది.సీనియర్ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ యశోదర ధన్వంతరి చిత్రపటానికి పూలమాల వేయగా, విజయవాడ ఆయుర్వేద కళాశాల రిటైర్డ్ సూపరింటెండెంట్  డాక్టర్ పద్మనాభరెడ్డి రిబ్బన్ కత్తిరించి శిబిరాన్ని ప్రారంభించారు. శిరిగిరి రమేష్ నిర్వహణలో  జరిగిన ఈ శిబిరంలో డాక్టర్ పద్మనాభరెడ్డి, డాక్టర్ శ్రావణ సంధ్య పాల్గొని 200 మంది రోగులను పరీక్షించి, లక్ష రూపాయలు విలువగల మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు, కోశాధికారి అమిదేల జనార్ధన్, డిప్యూటీ డెమో పామన్న, పురపాలక సానిటరీ సూపర్ వైజర్ మురళీధర్ పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

శ్రీశైలంలో లోకకల్యాణార్థం పంచమఠాలలో  పూజాదికాలు శ్రీశైలంలో లోకకల్యాణార్థం పంచమఠాలలో పూజాదికాలు
శ్రీశైలంలో లోకకల్యాణార్థం పంచమఠాలలో  పూజాదికాలు    నంది పత్రిక:   శ్రీశైలంలో లోక కల్యాణార్థం పంచమఠాలలో ఉదయం విశేషంగా అభిషేకం, పుష్పార్చనలు జరిపించబడ్డాయి. ముందుగా ఘంటామఠంలో ఆ తరువాత వరుసగా...
మైనారిటీలకు అండగా కూటమి ప్రభుత్వం
జిల్లాలో LPG గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదు
10వ తరగతి పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్‌ మృతి
రోడ్డు ప్రమాదాల నివారణకు ‘స్టాప్‌ - వాష్‌ అండ్‌ గో’ కార్యక్రమం.
నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం 
శ్రీశైలం దేవస్థానంలో విధుశేఖర భారతీ మహాస్వామి ఆలయ సందర్శన