శ్రీశైలం దేవస్థానంలో విధుశేఖర భారతీ మహాస్వామి ఆలయ సందర్శన
On
శ్రీశైలం దేవస్థానంలో విధుశేఖర భారతీ మహాస్వామి ఆలయ సందర్శన
శ్రీశైలం మార్చి 09(నంది పత్రిక)
శృంగేరి శారదాపీఠం ఉత్తరాధికారి జగద్గురు విధుశేఖర భారతీ మహాస్వామి ఆలయానికి విచ్చేసి శ్రీ స్వామిఅమ్మవార్లను సేవించారు.ఈ ఉదయం ఆలయం వద్దకు చేరుకున్న పీఠాధిపతి వారికి సంప్రదాయాన్ని అనుసరించి రాజగోపురం వద్ద కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు చిట్టిబొట్ల భరద్వాజశర్మ, అర్చకస్వాములు, వేదపండితలు, ఆలయ విభాగం అధికారులు సంప్రదాయబద్దంగా పూర్ణకుంభంతో స్వాగతంపలికారు. అనంతరం వారు శ్రీ స్వామిఅమ్మవార్లను దర్శించుకుని పూజాదికాలను నిర్వహించారు.
తరువాత అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో జగద్గురు విధుశేఖర భారతీ మహాస్వామి వారి గౌరవార్థం వేదగోష్ఠి నిర్వహించబడింది.తరువాత గురువందన కార్యక్రమం జరిపించబడింది. అనంతరం మహాస్వామివారు అనుగ్రహ భాషణం చేశారు. ఈ సందర్భంగా వారు సనాతన ధర్మం యొక్క విశిష్టత, శ్రీశైలక్షేత్ర మహిమా విశేషాలు, శివానందలహరి – సౌందర్యలహరి స్తోత్రాల విశేషాలను వివరించారు.
మహాస్వామివారు భక్తులందరికీ ఆశీర్వచనాలను అందజేశారు.
మహాస్వామివారు భక్తులందరికీ ఆశీర్వచనాలను అందజేశారు.Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
21 Apr 2026 18:11:57
ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం పిఅర్టియూ మహా ధర్నా
నంద్యాల ప్రతినిధి. ఏప్రిల్ 21 . (నంది పత్రిక ):ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్, ఆంధ్ర...

Comment List