గాజులపల్లెలో భారీ అగ్నిప్రమాదం

On

GridArt_20260222_234955306

మహానంది, పల్లె వెలుగు మహానంది మండలం గాజులపల్లె గ్రామ పరిధిలోని మెట్ట నుంచి మహాదేవపురం గ్రామానికి వెళ్లే దారిలోని బిస్కెట్ తయారీ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం రాత్రి 9:30 గంటల సమయంలో విద్యుత్ ఘాతంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. మంటలు ఎగిసి పడుతుండటాన్ని గమనించిన స్థానికులు మంటలను ఆర్పేందుకు శక్తికిమించి ప్రయత్నించారు. వెంటనే స్థానికులు నంద్యాల అగ్నిమాపకశాఖ సిబ్బంది సమాచారం అందజేయడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేశారు. ఈ ఘటనలో పలురకాల యంత్రాలు, బిస్కెట్లు తయారు చేసేందుకు ఉపయోగించే పలు రకాల పదార్థాలు, విద్యుత్ పరికరాలు కాలి పోయాయని తెలిపారు. ఈ అగ్నిప్రమాదంలో రూ. లక్షల్లో నష్టం వాటిల్లిందని స్థానికులు చర్చించుకుంటున్నారు.

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News