తిమ్మాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన నంద్యాల జిల్లా కలెక్టర్
ఐదుగురు సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు
నంద్యాల జిల్లా మహానంది మండలం తిమ్మాపురం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై సమగ్రంగా ఆరా తీసిన కలెక్టర్, సిబ్బంది నిర్లక్ష్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉదయం 10:10 గంటల వరకు ఇద్దరు వైద్యులు, ఒక ల్యాబ్ టెక్నీషియన్, ఒక ఫార్మసిస్ట్ విధులకు హాజరు కాలేదని గుర్తింపు.విధులకు హాజరుకాని ముగ్గురు సిబ్బంది తరఫున MPHO ద్వారా మూమెంట్ రిజిస్టర్లో సంతకాలు చేయడం వెలుగులోకి వచ్చింది.ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కలెక్టర్, సంబంధిత ఐదుగురు సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.ఆసుపత్రిలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చూడాలని, పరిసరాల్లో పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలని కలెక్టర్ సూచించారు.

Comment List