శ్రీ శ్రీ లక్ష్మి రంగనాథ స్వామి హుండీ లెక్కింపు

:- గత ఏడాది కంటే పెరిగిన హుండీ ఆదాయం.
దేవస్థానం అధికారి సాయికుమార్ వెల్లడి.
జూపాడుబంగ్లా :ఏప్రిల్ :13: (నంది పత్రిక) రాయలసీమలోనే ప్రసిద్ధి చెందిన శ్రీ శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి ఆలయ హుండీ లెక్కింపు దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారి సాయికుమార్ పర్యవేక్షణలో సోమవారం జరిగింది. తర్తూరు శ్రీ శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి జాతర సందర్భంగా దాదాపు ఆరు లక్షల మంది స్వామివారిని దర్శించుకోవడం జరిగిందన్నారు. మార్చి 26వ తేదీ న ప్రారంభమైన స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 4తేదీ తో ముగిశాయి. అయితే ఏప్రిల్ 2న తేదీన జరిగిన రథోత్సవ వేడుకలకు లక్ష మంది హాజరై భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 2025వ సంవత్సరం స్వామివారి ఆలయ హుండీ ఆదాయం రూ 11,21,770లు కంటే ఈ ఏడాది జరిగిన జాతర సందర్భంగా రూ 16,11,871లు రాగా ఆదాయము రూ 4,90,101లు వచ్చినట్లు ఈవో సాయికుమార్ వెల్లడించారు.

Comment List