దొంగలు బాబోయ్ దొంగలు సేవా కార్యక్రమాల్లో స్టువర్టుపురం దొంగలు . 

On

file_0000000047c072089eba30f670c1a37f

పల్లె వెలుగు నంద్యాల జిల్లా బ్యూరో. 

దొంగలు బాబోయ్ దొంగలు నంద్యాల జిల్లాలో జరుగుతున్న సేవా కార్యక్రమంలో స్టువర్టుపురం దొంగలు పడ్డారని జిల్లా ప్రజల నుండి విమర్శలు వస్తున్నాయి. నంద్యాల జిల్లాలో ఒక  సేవా మూర్తి, విశాల హృదయముతో ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు చేయలేని సేవలను తమ సొంత నిధులు వెచ్చించి పేదలను, రైతులను, రోగులను, నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని సేవా కార్యక్రమాలను కోన్ని నేలల క్రితమే శ్రీకారం చుట్టారు. నంద్యాల జిల్లాలోని నిరుద్యోగులకు, రోగులకు, పేదలకు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క సేవా కార్యక్రమాలు చేస్తూ సేవా మూర్తి ప్రజల నుండి ప్రశంసలు అందుకుంటు ప్రజలు  గుండెల్లో స్థానం సంపాదించుకుంటున్నారు. ఆయన చేస్తున్న  సేవలకు కోందరు అక్రమార్కులు తోడై  అందినకాడికి దోచుకుంటున్నారని ప్రజలు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు . సేవా కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తికి సహకరించవలసిందిగ పోయి సందట్లో సడేమియా అనే తిరుతో చోరబడి‌ తమ చేతివాటన్ని ప్రదర్శించి అందినకాడికి 
 దండుకుంటున్నారని ప్రజలు గుసగుస లాడుకుంటున్నారు.  నంద్యాల జిల్లాలోని పేద ప్రజల సంక్షేమం కోసం సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆ మహానుభావుడి వంచన చేరిన కొంతమంది స్వార్థ పరులు ఆయన చేసే సేవా కార్యక్రమాలకు గండి కోటే విదంగ స్టువర్టుపురం దొంగల అవతారం ఎత్తారని ప్రజలు చర్చించుకోవడం చర్చనీయాంశంగ మారుతుంది .  నంద్యాల జిల్లాలో నిరుద్యోగులు , రోగులు, పేదల ప్రజలు  , రైతుల కోసం ఆ సేవా మూర్తి డబ్బును చెక్కుల రూపంలో పంపిణీ చేయడం జరిగింది. ఆ చెక్కులు సరైన నిరుద్యోగులకు, రోగులకు, పేదలకు, రైతులకు చేరాయా ? లేదో ? అని జిల్లా ప్రజలు అనుమానాలు  వ్యక్తం  చేస్తున్నారు. జిల్లాలో చేస్తున్న సేవా కార్యక్రమలలో పడ్డ స్టువర్టుపురం దొంగలు పేదలకు ఆ చెక్కలను అందనీయకుండా తమతో పాటు  తమ సంబందికుల జేబులు నింపుకున్నారని కూడా  జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు.  సేవా కార్యక్రమంలో పడ్డ దొంగలు సేవా మూర్తి బామ్మర్దులా ? తమ్ముని కొడుకులా ? అక్క, చెల్లి పిల్లలా ? లేకపోతే సేవా మూర్తి భార్య తరపున బంధువులా ? అనే అనుమానాలు జిల్లా ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా నంద్యాల జిల్లాలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న మహానుభావుడు తమ సేవా కార్యక్రమంలో పడ్డ స్టువర్టుపురం దొంగలను సేవా కార్యక్రమాలలో పాలుపచ్చుకోనియకుండ , తాను చేస్తున్న సేవా కార్యక్రమాలకు అక్రమార్కులను దూరంగా పేడితే బాగుంటుంది  అని ప్రజాభిప్రాయం వ్యక్తం అవుతుంది . దీని వల్ల పేద ప్రజల కోసం చేస్తున్న సేవలు సజావుగా జరిగే అవకాశం ఉంటుందని, ఈవిషయం పై ఆ సేవా మూర్తి పునరాలోచించి తగు నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నంద్యాల జిల్లా లోని పేద ప్రజానికానికం కోరుకుంటూన్నారు.

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

శుభకార్యాలప్పుడు ‘అన్న క్యాంటీన్ల’కు విరాళాలు ఇవ్వండి శుభకార్యాలప్పుడు ‘అన్న క్యాంటీన్ల’కు విరాళాలు ఇవ్వండి
శుభకార్యాలప్పుడు ‘అన్న క్యాంటీన్ల’కు విరాళాలు ఇవ్వండి* • పేదవారికి అన్నం పెట్టడంలో నిజమైన సంతృప్తి  • నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు  • మధ్యాహ్న భోజనానికి...
అంగరంగ వైభోగంగా శ్రీ రామకృష్ణ విద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ప్రజా సమస్యల పరిష్కార వేదిక* *వేసవి దృష్ట్యా సమయ మార్పు - ఉదయం 9:30
ట్రావెల్స్ ఏజెన్సీ టూర్ ప్యాకేజీల పేర్లతో మోసాలు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
కళారాధన ఉచిత లలిత కళల శిక్షణా శిబిరం
ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం పిఅర్టియూ మహా ధర్నా 
ఇంటర్ ఫలితాల్లో 'న్యూక్లియస్' ప్రభంజనం