నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం 
మహానంది. మార్చి 12 . (నంది పత్రిక ):నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ లో ఉన్న నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో గురువారం మహానంది మండలం బుక్కాపురం గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు డాక్టర్ నెరవాటి వినోద్ కుమార్,డాక్టర్ అరుణ కుమారి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మహానంది మండలం బుక్కాపురం గ్రామం సచివాలయం వద్ద చెవి ముక్కు గొంతు వైద్య నిపుణులు డాక్టర్ వినోద్ కుమార్, స్త్రీ ప్రసూతి మరియు సంతాన సాఫల్య నిపుణులు డాక్టర్ అరుణకుమారి, ఎముకలు కీళ్ల వ్యాధిని నిపుణులు డాక్టర్ సుమన్ కుమార్ , గైనకాలజిస్ట్ డాక్టర్ ఫాతిమాభి, కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ పద్మ ప్రియాంక తదితరులు ఉచితంగా వైద్య సేవలు నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో సుమారు 300 మంది కి పైగ వైద్య సేవ నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రజలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Comment List