నంద్యాల జిల్లా స్థాయి చెస్ టోర్నమెంట్

On

17 సంవత్సరాల లోపు బాల బాలికల చదరంగం పోటీలు
ప్రారంభించిన డాక్టర్  రవి కృష్ణ

6714675c-a6de-40a7-84de-3f75ae8b1d94ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా చెస్ సంఘం నిర్వహణలో నంద్యాల జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామసుబ్బారెడ్డి పర్యవేక్షణలో ఆదివారం స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో నంద్యాల జిల్లా స్థాయి 17 సంవత్సరాల లోపు బాల బాలికల ఓపెన్ చెస్ టోర్నమెంట్ ప్రారంభమైంది.నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, ఎన్ ఆర్ జి చెస్ అకాడమీ అధ్యక్షులు కామినేని పల్లె సర్పంచ్ మేరువ చిన్న నరసింహారెడ్డి చదరంగం బోర్డ్ పై పావులు కదిలించి లాంఛనంగా టోర్నమెంట్ ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ చదరంగం క్రీడ  మేధాశక్తిని పదును పెడుతుందన్నారు. విద్యార్థులలో ఏకాగ్రతను ఇనుమడింప చేస్తుందన్నారు. ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన వారు రాష్ట్ర సాయి పోటీలలో నంద్యాల జిల్లా  తరపున పాల్గొంటారని అన్నారు.మేరువ చిన్న నరసింహారెడ్డి మాట్లాడుతూ క్రీడల ద్వారాగెలుపు ఓటములను స్వీకరించే ఆత్మస్థైర్యం పెరుగుతుందని అన్నారు. గెలిచినవారు మళ్లీ గెలవాలని ఓటమి చెందిన వారు నిరంతర సాధన ద్వారా భవిష్యత్తులో గెలుపు సాధించడానికి కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా  చెస్ సంఘం కార్యదర్శి రామసుబ్బారెడ్డి, ప్రముఖ సర్జన్ డాక్టర్ నీలా ప్రసాద్న రసింహారెడ్డి, నాగేశ్వరరెడ్డి క్రీడాకారులు వారి శిక్షకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.227b0679-4a34-4e5b-8623-31e9858cd029

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

రైతులు మోసపోయి తక్కువ ధరకు కందులను ఇవ్వొద్ధు. రైతులు మోసపోయి తక్కువ ధరకు కందులను ఇవ్వొద్ధు.
బేతంచెర్ల మండలంలోని ఆర్ఎస్ రంగాపురం గ్రామంలో, ప్రభుత్వం కందుల కొనుగోలు కేంద్రం ను ఏర్పాటు చేయడం మైనది.ఈ కొనుగోలు కేంద్రాన్ని రైతు సంఘం మండల అధ్యక్ష,కార్యదర్శులు సి...
రైతులు మోసపోయి తక్కువ ధరకు కందులను ఇవ్వొద్ధు.
నంద్యాల జిల్లా స్థాయి చెస్ టోర్నమెంట్
మహిళా మోర్చా నూతన కమిటీ -నంద్యాల జిల్లా అధ్యక్షురాలుగా నూకల శ్రీలక్ష్మి 
దొంగలు బాబోయ్ దొంగలు సేవా కార్యక్రమాల్లో స్టువర్టుపురం దొంగలు . 
న్యాయమూర్తులకు, న్యాయాధికారులకు డి.ఏ పెంపు
నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎండో క్రైనాలజిస్ట్ సేవలు