సమ్మెకు ఏపీయూడబ్ల్యూజే మద్దతు.

On

5e8b15b1-ecf4-4f84-bd63-2ab8bb431f4bసమ్మెకు ఏపీయూడబ్ల్యూజే మద్దతు... 
నంది పత్రిక: కర్నూలు: 
కేంద్ర ప్రభుత్వం పాత కార్మిక చట్టాలను రద్దు చేస్తూ.. కొత్తగా తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ, కార్మిక సంఘాలు చేపట్టిన దేశవ్యాప్త సమ్మెకు ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే)మద్దతు పలికింది. గురువారం జిల్లా పరిషత్ నుంచి కలెక్టరేట్ వరకు జరిగిన ర్యాలీలో పాల్గొనడంతో పాటు కలెక్టరేట్ ముందు జరిగిన ధర్నాలో కూడా నేతలు పాల్గొనడం జరిగింది. కొత్తగా తీసుకువచ్చిన లేబర్ కోడ్ల వల్ల జర్నలిస్ట ఉనికి ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు. ప్రధానంగా మాజీతీయా వేజ్ బోర్డు అమలు అటకెక్కే ప్రమాదం ఉందన్నారు. అలాగే ఉద్యోగ భద్రత గాల్లో దీపంగా మరే అవకాశం ఉందన్నారు. అలాగే జర్నలిస్టు యూనియన్ స్వరం కూడా మూగబోయే ప్రమాదం ఉందన్నారు. మొత్తం మీద జర్నలిస్టుల హక్కులు కాలరాసే విధంగా నాలుగు కోడ్లు ఉన్నాయన్నారు. కనుక కేంద్ర వెంటనే స్పందించి నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేయాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు జీ కొండప్ప, ఐజేయూ జాతీయ సమితి సభ్యులు కే నాగరాజు, జిల్లా అధ్యక్షుడు ఈ.ఎన్.రాజు, ప్రధాన కార్యదర్శి కే శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. సమ్మెకు మద్దతు పలికిన వారిలో యూనియన్ నాయకులు శివ, హరి కృష్ణ తదితరులు ఉన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

విజయవంతమైన ఆయుర్వేద వైద్య శిబిరం విజయవంతమైన ఆయుర్వేద వైద్య శిబిరం
విజయవంతమైన ఆయుర్వేద వైద్య శిబిరంశిరిగిరి వెంకప్ప పంచకర్మ  వైద్యశాల ఆధ్వర్యంలో నంద్యాల ప్రతినిధి. ఫిబ్రవరి 12 . నంది పత్రిక : నంద్యాల శిరిగిరి వెంకప్ప పంచకర్మ...
సమ్మెకు ఏపీయూడబ్ల్యూజే మద్దతు.
భక్తులందరికీ ప్రశాంత మల్లన్న దర్శనం
ఆరెండ్ల అంగ వైకల్యం అమ్మాయికి జ్ఞాన నిధి సేవా సంస్థ ఆర్థిక సహాయం
నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు 
తైక్వాండో బెల్ట్ గ్రేడింగ్ పోటీలు క్రీడలు విద్యార్థులలో ఆత్మస్థైర్యం కలిగిస్తాయి
ఫిబ్రవరి 8 వ తేదీ న నంద్యాల జిల్లా స్థాయి చెస్ పోటీలు -19 సంవత్సరంలోపు బాల   బాలికలకు   ప్రత్యేక విభాగాలలో -రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లా జట్ల ఎంపిక