ఉసిరికాయ మీద కార్తీక శోభ

-కళారత్న చింతలపల్లె కోటేష్ ప్రతిభ
నంద్యాల బ్యూరో. నవంబరు 02 . (పల్లె వెలుగు ):నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్ కార్తీక మాసం పురస్కరించుకొని కార్తీక సోమవారం సందర్బంగా ఓకే ఉసిరికాయ చుట్టూ మూడు ప్రధానమైన చిత్రాలను మైక్రో బ్రష్ ద్వారా అక్రాలిక్ కలర్స్ తో రెండు గంటల సమయంలో వేశారు. ఈ సందర్బంగా కోటేష్ మాట్లాడుతూ కార్తీక మాసంలో ఉసిరికి గొప్ప ప్రాధాన్యత వుంది. ఉసిరి చెట్టును సాక్షాత్తు శివుని స్వరూపమని చెబుతారు. అన్ని మాసాల కన్నా ఎంతో పవిత్ర మాసం కార్తీక మాసం.ఈ మాసంలో కార్తీక సోమవారాలకు, కార్తీక పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉందని భావిస్తారు. ఈ మాసంలో ఉసిరి చెట్టుకు ఉసిరి కాయలతో దీపాలు వెలిగించి భక్తితో పూజలు చేస్తారు. ఉసిరి చెట్టును పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయని, నవగ్రహ దోషాలు తొలగి పోతాయని, అనారోగ్య సమస్యలు దరి చేరవని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఎంతో విశిష్టత వున్నా ఉసిరికాయ మీద సూక్ష్మ చిత్రాలు వేసాను. నేను వేసిన ఈ చిత్రంలో పరమశివుడు అర్ధనారీశ్వరుని రూపంలో చిరునవ్వుతో భక్తులకు దర్శనమిచ్చి దీవిస్తున్నట్లు, ఉసిరి చెట్టు కింద ఉసిరి కాయలతో దీపాలు వెలిగించి భక్తులు పూజిస్తునట్లు, శివలింగం, శివాలయం, ప్రకృతి దృశ్యాలు, స్త్రీలు కార్తీక దీపాలు నదిలో వదలి భక్తితో మొక్కుతున్నట్లు, భక్తులు పుణ్య నదిలో స్నానాలు చేస్తున్నట్లు ఇలా కార్తీకశోభను ఓకే చిన్న ఉసిరికాయ మీద వేసాను . భక్తులందరికి కార్తీకమాసం శుభాకాంక్షలు. అందరికి ఆ శివయ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.

Comment List