శ్రీశైలం భారీగా మల్లన్న హుండీ ఆదాయం 3 కోట్ల 48 లక్షల 96 వేల 431 నగదు 

On

GridArt_20250918_185412092

131 గ్రాముల 300 మిల్లి గ్రాముల బంగారం,5 కేజీల 50 గ్రాముల వెండి లభించాయి
     
పల్లె వెలుగు:-నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం భారీగా పెరిగింది ఈరోజు చంద్రావతి కళ్యాణ మండపంలో హుండీ లెక్కింపు జరిగింది శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి  అమ్మవార్ల  ఉభయ ఆలయాలు, హుండీ లెక్కింపు నిర్వహించారు చంద్రవతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 3 కోట్ల 46 లక్షల 96 వేల 431 రూపాయల నగదు రాబడిగా లభించిందని దేవస్థానం డిప్యూటీ కార్య నిర్వహణ అధికారి ఆర్.రమణమ్మ తెలిపారు, ఈ ఆదాయాన్ని గత 29 రోజులులో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదును కానుకల రూపంలో సమర్పించినట్లు  డిప్యూటీ కార్యనిర్వహణ అధికారి ఆర్.రమణమ్మ వెల్లడించారు ఈహుండి లెక్కింపులో నగదుతో పాటు 131 గ్రాముల 300 మిల్లి గ్రాములు బంగారం,అలానే వెండి 5 కేజీల 50 గ్రాములు లభించగా నగదు బంగారుతో పాటు 2321 యుఎస్ఏ డాలర్లు,సింగపూర్ డాలర్లు 20, మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి.పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టడం జరిగింది హుండీల లెక్కింపులో డిప్యూటీ కార్యనిర్వహణ అధికారి ఆర్.రమణమ్మ పలు విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు తదితరులు పాల్గొన్నారు....

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

ఉసిరికాయ మీద కార్తీక శోభ ఉసిరికాయ మీద కార్తీక శోభ
-కళారత్న చింతలపల్లె కోటేష్ ప్రతిభ నంద్యాల బ్యూరో. నవంబరు 02 . (పల్లె వెలుగు ):నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్ కార్తీక మాసం...
కాకులేరు వాగును పరిశీలించిన. ఎంపీడీవో గోపికృష్ణ 
ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షెరాన్ IPS 
అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడు అండగా ఉంటుంది
ఎండోక్రిన్ డిస్రప్టోరు పై అవగాహన కార్యక్రమం 
సబ్సిడీ వేరుశనగ విత్తనాలు మొలకెత్తలే.. అన్నదాతల ఆవేదన.! 
భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి ఘన స్వాగతం