అర్జిఏమ్ ఇంజనీరింగ్ కళాశాలలో డ్రగ్స్ , రోడ్డు ప్రమాదాలు,సైబర్ క్రైమ్ ఫై అవగాహన కార్యక్రమం

On

పాణ్యం ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి

IMG-20260219-WA00147f88190b-f733-4e12-9dc4-7530af388c10
-డ్రగ్స్ పై ఫిర్యాదు చేయుటకు 1972 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయండి
-పాణ్యం ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి

నంద్యాల బ్యూరో. ఫిబ్రవరి 19 .  (నంది పత్రిక ):నంద్యాల జిల్లా జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాలమేరకు పాణ్యం ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అర్జిఏమ్ ఇంజనీరింగ్ కళాశాల నందు డ్రగ్స్ వాడకం వలన కలిగే అనర్థాలు,సైబర్ క్రైమ్, ర్యాగింగ్ మహిళలపై జరిగే నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
డ్రగ్స్ వాడడం వలన కలిగే అనర్థాలు ఈ అవగాహన కార్యక్రమం నందు  ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ డ్రగ్స్ ప్రధానంగా నేరుగా మెదడుపైన, కేంద్ర నాడీ వ్యవస్థపైన ప్రభావం చూపుతాయి. ఇది డ్రగ్స్ వల్ల తలెత్తే తక్షణ దుష్ప్రభావం. వీటిని వాడుతుండే కొద్దీ శరీరంలోని ఇతర వ్యవస్థలపైనా దారుణమైన దుష్ప్రభావాలు చూపుతాయి. చివరకు అకాల మరణాలకు కారణమవుతాయి. ఎవరికైనా డ్రగ్స్ గురించిన సమాచారం తెలిస్తే వెంటనే ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు సమాచారం అందించాలని మీ వివరాలు గొప్పంగా ఉంచుతామన్నారు.
1.రోగనిరోధక వ్యవస్థ బాగా దెబ్బతింటుంది.
2.జీర్ణవ్యవస్థ పనితీరు దెబ్బతిని, శరీరం శుష్కించిపోతుంది.
3.లివర్పై విపరీతమైన ఒత్తిడి ఏర్పడి, చివరకు అది పూర్తిగా పనిచేయని స్థితి ఏర్పడుతుంది.
4.ఊపిరితిత్తుల పనితీరు మందగిస్తుంది.
5.గుండె వేగంలో అవాంఛనీయమైన మార్పులు తలెత్తుతాయి.
6.రక్తనాళాలు కుంచించుకుపోయి, రక్తప్రసరణకు ఆటంకాలు ఏర్పడతాయి అని తెలియజేశారు.
రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా మానవ తప్పిదం వల్లనే జరుగుతున్నాయని, కావున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రోడ్డు  భద్రత నిబంధనలు పాటించాలని, ముఖ్యంగా మోటార్ సైకిల్ పై ప్రయాణించేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలని తెలియజేయడం జరిగింది.సైబర్ క్రైమ్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ నేరాల నియంత్రణకు స్వీయ అప్రమత్తతే ముఖ్యమని తెలియజేశారు.ఎవరైనా సైబర్ క్రైమ్ నేరగాళ్ల మాయలో పడి మోసపోతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసి సహాయం పొందవచ్చు.ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియని వ్యక్తుల నుండి వచ్చే లింకులను ఓపెన్ చేయకూడదని, ఆన్లైన్ లావాదేవీలు చేసే క్రమంలో టెక్నాలజీని వాడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని అత్యాశకు వెళ్లి సైబర్ క్రైమ్ నేరగాళ్ల మాయలో పడవద్దని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాణ్యం ఇన్స్పెక్టర్ తో పాణ్యం సబ్ ఇన్స్పెక్టర్ కళాశాల ఉపాధ్యాయ బృందం  పాల్గొన్నారు.

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News