శ్రీశైలంలో మండలం సునిపెంట లో సబ్ డి.ఎఫ్.ఓ భబిత ఆధ్వర్యంలో అకాస్మిక తనిఖీలు
*శ్రీశైలంలో మండలం సునిపెంట లో సబ్ డి.ఎఫ్.ఓ భబిత ఆధ్వర్యంలో అకాస్మిక తనిఖీలు*
*పాత సున్నిపెంటకు చెందిన ఒక వ్యక్తి ఇంట్లో చిరుత పులి గోరు, కణితి కొమ్ము లభ్యం*
*చిరుత పులి గోరు,కనితి కొమ్ము లభ్యం*
*నిందితుడుపై పలు అటవీశాఖ చట్టాల కింద కేసు నమోదు*
పల్లె వెలుగు శ్రీశైలం ప్రాజెక్ట్.....
నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపెంట గ్రామంలో అడవి జంతువుల అవశేషాలు లలో చిరుత పులి గోరు కణతి కొమ్ము బహిర్గతమైంది. డిప్యూటీ డైరెక్టర్ ప్రాజెక్టు టైగర్ విగ్నేష్ అప్పావో ఆత్మకూరు వారికి అందిన రహస్య సమాచారం మేరకు పాత సుండి పెంట లోని నివాసం ఉంటున్న చెన్నారెడ్డి ఇంటిలో చిరుత పులి గోరు, కనితి కొమ్ము దొరకడంతో వాటిని స్వాధీనపరుచుకున్నారు అటవీ వన్యప్రాణి సంరక్షణ చట్టం1972 ప్రకారం నేరం అయితే పట్టుబడిన వై చెన్నారెడ్డి పై అటవీ శాఖ చట్టాల కింద కేసు నమోదు చేసి అధికారులు జంతువు అవశేషాలను స్వాధీన పరుచుకున్నారు. నిందితుడికి 41 నోటీస్ విచారణకు హాజరు అవ్వాలంటే రేపటి వరకు అధికారులు గడువు ఇచ్చారు ఈ సందర్భంగా ఆటవిశాఖ సబ్ డీఎఫ్ఓ బాబిత,రేంజర్ పరమేశ్వరుల మాట్లాడుతూ తమ తమ ఇంటిలో వన్యప్రాణులకు సంబంధించిన విశేషాలు జంతు చర్మాలు,కొమ్ములు,గోర్లు, దంతాలు వంటివి ఉండకూడదని ఒకవేళ కలిగి ఉంటే అటవీశాఖ అధికారులకు వాటిని అప్పగించాలని అలాకాకుండా వాళ్ళ దగ్గర పెట్టుకొని మాకు అప్పజెప్పకుండా ఉంటే మాకు ఏదయినా సమాచారం వస్తే దాడులు చేసి కఠినమైన కేసులు నమోదు చేస్తామని తెలియజేశారు...

Comment List