ట్రాన్స్ఫార్మర్ కోసం రూ. 15 వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన లైన్ మెన్ ! 

On

IMG-20251014-WA0011

నాగర్ కర్నూల్ ప్రతినిధి అక్టోబర్ 14, పల్లె వెలుగు దినపత్రిక: నాగర్ కర్నూల్ జిల్లాలోని ఓ అవినీతి అధికారి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. జిల్లాలోని వంగూరు మండలం మాచినోనిపల్లి టీజీఎస్పీడిసిఎల్ కు  చెందిన లైన్ మెన్ తోట నాగేంద్ర మంగళవారం రూ. 15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కాడుకి చిక్కాడు. వ్యవసాయానికి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం రైతులు లైన్ మెన్ ను సంప్రదించగా లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధిత రైతు మహబూబ్నగర్ పరిధిలోని ఏసీబీని ఆశ్రయించగా మంగళవారం అధికారులు పట్టుకున్నారు. అవినీతికి పాల్పడ్డ లైన్ మెన్ పై కేసు నమోదు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టామని అధికారులు వివరించారు. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు ఎవరైనా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అవినీతికి పాల్పడే వారి సమాచారాన్ని ఏసీబీ టోల్ ఫ్రీ 1064 నెంబర్ కు సమాచారం అందించాలని సూచించారు. వాట్సాప్ నెంబర్ 9440446106 కు తెలంగాణ ఏసీబీ, ఫేస్ బుక్ ట్విట్టర్ ద్వారా గాని ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించారు.

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

కాకులేరు వాగును పరిశీలించిన. ఎంపీడీవో గోపికృష్ణ  కాకులేరు వాగును పరిశీలించిన. ఎంపీడీవో గోపికృష్ణ 
  జూపాడుబంగ్లా అక్టోబర్29 (నంది పత్రిక) మెంధా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి వాగులు వంకలు పొంగి పొల్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు
ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షెరాన్ IPS 
అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడు అండగా ఉంటుంది
ఎండోక్రిన్ డిస్రప్టోరు పై అవగాహన కార్యక్రమం 
సబ్సిడీ వేరుశనగ విత్తనాలు మొలకెత్తలే.. అన్నదాతల ఆవేదన.! 
భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి ఘన స్వాగతం
కమిషనర్ గారు మా వార్డును సందర్శించండి.