నంద్యాల జిల్లాలో  131 డిఏపి బస్తాలు సీజ్

On

గాజులపల్లెలో  131 డిఏపి బస్తాలు సీజ్

955dbe17-2a95-4dda-aa00-ad4753fdfb28
 మహానంది మండలం గాజులపల్లి గ్రామంలో  దీప్తి ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ ఎరువులు మరియు పురుగు మందుల దుకాణం నందు 131 బస్తాల డిఏపి ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తున్నందున సీజ్ చేసినట్లు మండల వ్యవసాయ అధికారి నాగేశ్వరరెడ్డి ఆదివారం రాత్రి తెలిపారు.దీప్తి ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ దుకాణం నందు ప్రభుత్వం నిర్ణయించిన డిఎపి  ధర రూ.1350 కాగా 1400  రూపాయలకు అమ్మినట్లు  అధిక ధరకు విక్రయించినట్లుగా నిర్ధారించుకొని ఈసీ ఆక్ట్ 1955 మరియు ఎరువుల నియంత్రణ చట్టం 1985 ప్రకారం 6ఏ కేసు నమోదు చేయడం జరిగిందని అన్నారు.సదరు దుకాణం నందు  176,850 రూపాయల విలువగల  డి ఏ పి ఎరువులు సీజ్ చేయడం జరిగిందన్నారు.మరియు రూ.10926 యూరియా ఎరువులు అమ్మకాలు నిలుపుదల చేసినట్లు ఏవో తెలిపారు.తదుపరి చర్య నిమిత్తము ఉన్నతాధికారులకు 6ఎ కేసు రిపోర్టు పంపిస్తామని తెలిపారు.ఈ తనిఖీలో కర్నూలు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ వెంకట ప్రసాద్  వారి సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

కాకులేరు వాగును పరిశీలించిన. ఎంపీడీవో గోపికృష్ణ  కాకులేరు వాగును పరిశీలించిన. ఎంపీడీవో గోపికృష్ణ 
  జూపాడుబంగ్లా అక్టోబర్29 (నంది పత్రిక) మెంధా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి వాగులు వంకలు పొంగి పొల్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు
ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షెరాన్ IPS 
అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడు అండగా ఉంటుంది
ఎండోక్రిన్ డిస్రప్టోరు పై అవగాహన కార్యక్రమం 
సబ్సిడీ వేరుశనగ విత్తనాలు మొలకెత్తలే.. అన్నదాతల ఆవేదన.! 
భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి ఘన స్వాగతం
కమిషనర్ గారు మా వార్డును సందర్శించండి.