పురుగు మింగి చిన్నారి మృతి
On

నంది పత్రిక:-August 26, 2025 :-చెన్నై: చిన్నారి పురుగుని మింగి ఊపిరాడక మృతి చెందిన సంఘటన తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా పెరియాపాళ్యంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్కారం… తామరైపాక్కానికి చెందిన కార్తీక్ అనే రైతుకు గుగశ్రీ అనే ఏడాది పాప ఉంది. ఇంటి వద్ద ఆడుకుంటుండగా పురుగుని మింగేసింది. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. స్కానింగ్ చేయగా గొంతులో వస్తువు ఇరుక్కుంది అనుకున్నారు. గొంతులో నుంచి బయటకు తీయగా పురుగు అని తెలిసింది. చికిత్స తీసుకుంటూనే గుగశ్రీ చనిపోయింది. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆ గ్రామ ప్రజలు విషాదంలో మునిగిపోయారు.
About The Author
Related Posts
Post Comment
Latest News
04 May 2026 16:56:01
-పాఠశాల అభివృద్ధికి ప్రణాళిక

Comment List