సేవ రత్నం నేషనల్ అవార్డు ఎంపికైన కౌటం రమేష్
భూపాలపల్లి ఆగస్టు 05 పల్లె వెలుగు ప్రతినిధి: సేవరత్నం నేషనల్ అవార్డు 2025 సంవత్సరమునకు గాను ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషన్ అసోసియేషన్ భూపాలపల్లి జయశంకర్ జిల్లా ప్రధాన కార్యదర్శి జోగంపల్లి గ్రామవాసి అయిన కౌటం రమేష్ ముదిరాజ్ ఎంపికైనట్లు జాతీయ అవార్డు కమిటీ వారు ప్రకటించారు.అవార్డు నేషనల్ కమిటీ నేషనల్ చైర్మన్ మరియు బిఎస్ఏ జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ అవార్డు ఆహ్వాన పత్రాన్ని హైదరాబాదులోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయములో అందజేశారు.ఈ సందర్భంగా నల్లా రాధాకృష్ణ మాట్లాడుతూ...బహుజన సాహిత్య అకాడమీ వారు ప్రతి ఏట ప్రజా ఉద్యమకారులకు, సంఘ సేవకులకు, రచయితలకు,కవులకు మరియు స్వచ్ఛంద సంస్థలకు అవార్డులను వచ్చే నెల సెప్టెంబర్ 5న తిరుపతి లోని గంధమనేని శివయ్య మెమోరియల్ ట్రస్టు కమ్యూనిటీ హాల్ లో అందజేయనున్నట్లు తెలియజేశారు.ఈఅవార్డు లెటర్ అందజేసిన వారిలో.. తెలంగాణ రాష్ట్ర కో - ఆర్డినేటర్ , హనుమాoడ్ల విష్ణు, అవార్డు సెలక్షన్ కమిటీ నెంబర్ వంగ కుమార్ స్వామి,కనుకుంట్ల విజయ్ కుమార్, మల్కరీ అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు.
Comment List