శ్రీ కామేశ్వరి అమ్మవారి వైభవంపై పుస్తకాల ముద్రణ

On

GridArt_20250721_074819532

మహానంది జూలై 20 (నంది పత్రిక):- 

మహానంది పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీ కామేశ్వరి అమ్మవారి వైభవంపై భక్తులు పుస్తకాలు ముద్రించారు.హైదరాబాద్‌కు చెందిన వారణాసి రామ్మోహన్ రావు,విజయలక్ష్మి దంపతులు,వారి కుమార్తెలు తంగిరాల హరికృష్ణ, కామేశ్వరీ కమల మాధవి, శ్రీనివాస సుధాకర్, మీనాక్షి సుబ్బలక్ష్మి, రాధలతో కలిసి వారి కులదైవం అయిన మహానందిలోని శ్రీ కామేశ్వరీ అమ్మవారి వైభవంపై ‘శ్రీ కామేశ్వరి వ్రతకల్పం, పూజా విధానం’ పుస్తకాన్ని ముద్రించారు. దీనిపై ఆలయ ఈవో శ్రీనివాస రెడ్డి, వేద పండితులు రవిశంకర్ అవధాని అభినందించారు.ఆదివారం మహానందిలో ఆ పుస్తకాలను అమ్మవారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేసి ఆవిష్కరించారు.పుస్తక ముద్రణ దాతలు మాట్లాడుతూ శ్రీ కామేశ్వరీ దేవి అమ్మవారు ఎంతో మహిమాన్వితురాలు అని అన్నారు.గత 170 సంవత్సరాలుగా మా కుటుంబీకుల ఇలవేల్పు అన్నారు.అమ్మవారి వైభవాన్ని, మహిమలను అందరికీ తెలియాలనే ఉద్దేశ్యం తో పుస్తకాలు ముద్రించామన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

కాకులేరు వాగును పరిశీలించిన. ఎంపీడీవో గోపికృష్ణ  కాకులేరు వాగును పరిశీలించిన. ఎంపీడీవో గోపికృష్ణ 
  జూపాడుబంగ్లా అక్టోబర్29 (నంది పత్రిక) మెంధా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి వాగులు వంకలు పొంగి పొల్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు
ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షెరాన్ IPS 
అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడు అండగా ఉంటుంది
ఎండోక్రిన్ డిస్రప్టోరు పై అవగాహన కార్యక్రమం 
సబ్సిడీ వేరుశనగ విత్తనాలు మొలకెత్తలే.. అన్నదాతల ఆవేదన.! 
భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి ఘన స్వాగతం
కమిషనర్ గారు మా వార్డును సందర్శించండి.