శ్రీ కామేశ్వరి అమ్మవారి వైభవంపై పుస్తకాల ముద్రణ

On

GridArt_20250721_074819532

మహానంది జూలై 20 (నంది పత్రిక):- 

మహానంది పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీ కామేశ్వరి అమ్మవారి వైభవంపై భక్తులు పుస్తకాలు ముద్రించారు.హైదరాబాద్‌కు చెందిన వారణాసి రామ్మోహన్ రావు,విజయలక్ష్మి దంపతులు,వారి కుమార్తెలు తంగిరాల హరికృష్ణ, కామేశ్వరీ కమల మాధవి, శ్రీనివాస సుధాకర్, మీనాక్షి సుబ్బలక్ష్మి, రాధలతో కలిసి వారి కులదైవం అయిన మహానందిలోని శ్రీ కామేశ్వరీ అమ్మవారి వైభవంపై ‘శ్రీ కామేశ్వరి వ్రతకల్పం, పూజా విధానం’ పుస్తకాన్ని ముద్రించారు. దీనిపై ఆలయ ఈవో శ్రీనివాస రెడ్డి, వేద పండితులు రవిశంకర్ అవధాని అభినందించారు.ఆదివారం మహానందిలో ఆ పుస్తకాలను అమ్మవారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేసి ఆవిష్కరించారు.పుస్తక ముద్రణ దాతలు మాట్లాడుతూ శ్రీ కామేశ్వరీ దేవి అమ్మవారు ఎంతో మహిమాన్వితురాలు అని అన్నారు.గత 170 సంవత్సరాలుగా మా కుటుంబీకుల ఇలవేల్పు అన్నారు.అమ్మవారి వైభవాన్ని, మహిమలను అందరికీ తెలియాలనే ఉద్దేశ్యం తో పుస్తకాలు ముద్రించామన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

స్టార్ న‌టి జ్యోతిక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు స్టార్ న‌టి జ్యోతిక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
హైద‌రాబాద్‌: స్టార్ న‌టి జ్యోతిక సౌత్‌పై మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. సౌత్ ఇండ‌స్ట్రీ సినిమా పోస్ట‌ర్‌ల‌లో హీరోలే ఉంటారు కానీ హీరోయిన్‌లు క‌నిపించ‌ర‌ని మండిప‌డింది. ఒక...
సూరి'కి బర్త్ డే విషెష్ చెప్పిన టాప్ హీరోయిన్.. ఫోటో వైరల్
నంద్యాల:మంత్రుల సమావేశం రద్దు-కలెక్టర్
నంద్యాల:పెన్ను క్యాప్ మీద 60 సూక్ష్మ వినాయకులు
టిఎన్సీ నాగేంద్ర, సీవో  చెప్తేనే డబ్బులు వసూలు చేశా.. యానిమేటర్ హైమావతి
పురుగు మింగి చిన్నారి మృతి
అన్నమయ్య జిల్లా  కేశాపురం హత్య కేసు చేధన – నిందితుడు అరెస్ట్.