గర్భిణీ స్త్రీ లకు నార్మల్ కాన్పు అయ్యే ల  జాగ్రత్త వహించలి

On

గర్భిణీ స్త్రీ లకు నార్మల్ కాన్పు అయ్యే ల  జాగ్రత్త వహించలి

IMG_20241022_190235

నంద్యాల ప్రతినిధి. అక్టోబర్ 22 . (నంది పత్రిక ):నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా ఆర్ వెంకటరమణ తిమ్మాపురం ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని,మహానంది ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆకస్మికముగా తనిఖీ చేశారు. వైద్యాధికారులు మరియు వైద్య ఆరోగ్య సిబ్బంది సమయ పాలన తప్పని సరిగా పాటించవలేనని లేనిచో కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ తనిఖీ లో భాగముగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రము లోని ఒపి విభాగాన్ని మరియు అక్కడ వున్నటువంటి రోగులకు, వారికి అందె సేవలు మరియు చికిత్సలు,మందులు, వారి పట్ల వైద్యాధికారి మరియు వైద్య ఆరోగ్యసిబ్బంది ఎలా వ్యవహరిస్తున్నారు. మరియు ఒపి విభాగ్యములోని రికార్డులను మరియు రిపోర్టులను తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రములో జాతీయ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ కార్యక్రమాల ఐఈసి  మెటీరియల్ ప్రదర్శన ను అవగాహన కొరకు ప్రజలకు మరియు రోగులకు అందుబాటులో ఉండే విధముగా ప్రదర్శించవలేనని లేనిచో కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించడమైనది. కాన్పు వార్డును ఆపరిశీలించి కాన్పు కొరకు వచ్చే ప్రతి గర్భిణీ స్త్రీ ని వీలైనంత వరకు నార్మల్ కాన్పు అయ్యే విధముగా జాగ్రత్త వహించవలేనని మరియు మాతాశిశు సంరక్షణ చర్యలు తీసుకోవలేనని లేనిచో కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించడమైనది. బాలింత స్త్రీ కి మరియు పుట్టిన బిడ్డకు అవసరమైన సంరక్షణ చర్యలు చేపట్టవలేనని మరియు వారికి , కార్యక్రమాల క్రింద రావలసిన రాయితీలు సరైన సమయములో అందించవలేనని లేనిచో కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించడమైనది. మందుల గదిని తనిఖీ చేసి అందులో రికార్డులను పరిశీలించడం జరిగినది .ల్యాబ్ ను,వ్యాధినిరోధకాల గదిని తనిఖీ చేసి తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని ఆదేశాలు జారీచేయడమైనది.

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

కాకులేరు వాగును పరిశీలించిన. ఎంపీడీవో గోపికృష్ణ  కాకులేరు వాగును పరిశీలించిన. ఎంపీడీవో గోపికృష్ణ 
  జూపాడుబంగ్లా అక్టోబర్29 (నంది పత్రిక) మెంధా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి వాగులు వంకలు పొంగి పొల్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు
ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షెరాన్ IPS 
అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడు అండగా ఉంటుంది
ఎండోక్రిన్ డిస్రప్టోరు పై అవగాహన కార్యక్రమం 
సబ్సిడీ వేరుశనగ విత్తనాలు మొలకెత్తలే.. అన్నదాతల ఆవేదన.! 
భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి ఘన స్వాగతం
కమిషనర్ గారు మా వార్డును సందర్శించండి.