పూరి- సేతుపతి ప్రాజెక్ట్ డిజిటల్ కంటెంట్ క్రియేటర్

On

GridArt_20250519_083017103

నంది సినిమా పత్రిక

పూరి- సేతుపతి ప్రాజెక్ట్ల డిజిటల్ కంటెంట్ క్రియేటర్ 'మహారాజా' మూవీతో సంచలనం సృష్టించిన తమిళ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో టాలీవుడ్ వెర్సటైల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఓ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్్న ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో ఆలోచనలో పడిన క్రేజీ రైటర్ కమ్ డైరెక్టర్ పూరి సరికొత్త కథతో ఓ భారీ సినిమాకు శ్రీకారం చుట్టాడు. ఇందులో హీరో ఎవరు అనే చర్చ జరుగుతుండగానే తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి హీరో అంటూ ప్రకటించి షాక్

ఇచ్చాడు. ఓ బిచ్చగాడి కథ నేపథ్యంలో ఈ సినిమాని పూరి జగన్నాథ్ అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా తెరపైకి తీసుకురాబోతున్నారు. పూరి చెప్పిన స్టోరీలైన్ నచ్చడంతో హీరో విజయ్ సేతుపతి ఈ ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

విలక్షణమైన కథతో రూపొందనున్న ఈ మూవీలో టబు కీలక పాత్రలో కనిపించబోతోంది. మరో ప్రధాన పాత్రలో కన్నడ నటుడు దునియా విజయ్ కనిపించనున్నారు. ఇప్పటికే వీరిద్దరికి సంబంధించి అధికారికంగా టీమ్ ప్రకటించడం తెలిసిందే. అయితే ఈ మూవీలో మరో సర్ప్రైజ్

ఉందని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మంచి గుర్తింపు పొందిన యూట్యూబర్, డిజిటల్ కంటెంట్ క్రియేటర్ నిహారిక కూడా ఓ కీలక క్యారెక్టర్లో నటించనుందని తెలిసింది.

ఇప్పటికే తను పూరీ - విజయ్ సేతుపతిల ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని, త్వరలోనే ఈ విషయాన్ని పూరి టీమ్ అధికారికంగా ప్రకటించనుందని ఇన్ సైడ్ టాక్. క్రేజీ కాంబినేషన్లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి ప్రారంభం కాబోతోంది.

Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

కాకులేరు వాగును పరిశీలించిన. ఎంపీడీవో గోపికృష్ణ  కాకులేరు వాగును పరిశీలించిన. ఎంపీడీవో గోపికృష్ణ 
  జూపాడుబంగ్లా అక్టోబర్29 (నంది పత్రిక) మెంధా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి వాగులు వంకలు పొంగి పొల్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు
ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షెరాన్ IPS 
అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడు అండగా ఉంటుంది
ఎండోక్రిన్ డిస్రప్టోరు పై అవగాహన కార్యక్రమం 
సబ్సిడీ వేరుశనగ విత్తనాలు మొలకెత్తలే.. అన్నదాతల ఆవేదన.! 
భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి ఘన స్వాగతం
కమిషనర్ గారు మా వార్డును సందర్శించండి.