ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో భారీగా మద్యం అమ్మకాలు
తరచూ పట్టుబడుతున్న మద్యం విక్రయదారులు
శ్రీశైలం ఆర్టీసీ బస్సు పార్కింగ్ ఏరియాలో మద్యం అమ్ముతూ పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తులు
తనిఖీలలో భాగంగా ఆర్టిసి బస్సు పార్కింగ్ ఏరియాలో మద్యం అమ్ముతున్న ఇద్దరి వ్యక్తుల దగ్గర 98 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్న శ్రీశైలం పోలీసులు
మద్యం అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసిన శ్రీశైలం పోలీసులు
నంది పత్రిక శ్రీశైలం....నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో భారీగా మద్యం పట్టివేత,శ్రీశైలం పోలీసులు కేసులు నమోదు ,మద్యం అమ్ముతూ పట్టుబడ అమ్మే విక్రయదారులు,శ్రీశైలం ఆర్టీసీ బస్ పార్కింగ్ ఏరియాలో మద్యం అమ్ముతూ పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తులు నుండి 98 మద్యం బాటిల్ స్వాధీనం చేసుకున్న శ్రీశైలం పోలీసులు,శ్రీశైలం సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ రావు మరియు సిబ్బంది తనిఖీలలో భాగంగా ఆర్టీసీ బస్సు పార్కింగ్ ఏరియాలో మద్యం అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుండి 98 మద్యం బాటిలను స్వాధీనం చేసుకున్నారు మద్యం అమ్ముతున్న మొటీరం మరియు బుజ్జి వారిపై కేసు నమోదు చేశారు.దేవాదాయ ధర్మాదాయ శాఖ నిబంధనలను అనుసరించి క్షేత్రంలో ఎటువంటి మత్తు పానీయాలను తీసుకురావడం విక్రయించడం వంటి వాటిపై ఉక్కు పాదం మోపుతామని క్షేత్రం పవిత్రతకు భంగం వాటిలితే చట్టరీత్యా వారిని శిక్షిస్తామని సిఐ ప్రసాదరావు హెచ్చరికలు జారీ చేశారు....
Comment List