యోగాతో ఆధ్యాత్మిక, మానసిక, శారీరక ఆరోగ్యం సిద్ధిస్తుంది
On
నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

*జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను ఎదుర్కోవచ్చు*
నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా*
*అహోబిలం/నంద్యాల, జూన్ 18:-*
*ప్రతిరోజు యోగా చేయడం వల్ల ఆధ్యాత్మిక, మానసిక, శారీరక ఆరోగ్యం సిద్ధిస్తుందని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి పేర్కొన్నారు. బుధవారం అహోబిలం పుణ్యక్షేత్ర ప్రాంగణంలో 2000 మందిచే నిర్వహించిన 2025 యోగాంధ్ర కార్యక్రమాన్ని కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్ లు జ్యోతి వెలిగించి ప్రారంభించారు.*
*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న యోగాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ యోగ క్రియలు ఆచరించి ఆధ్యాత్మిక, మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పొందాలని సూచించారు. మన దేశంలో పుట్టిన యోగాను175 దేశాల్లో అవలంబిస్తున్నారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా యోగాకు మరింత ప్రాచుర్యం వచ్చేలా రాష్ట్ర ముఖ్యమంత్రి నెల రోజులపాటు యోగాకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలైన శ్రీశైలం, మహానంది, బెలుం గుహలు, అహోబిలంలలో నిర్వహించడం జరిగిందన్నారు. గురువారం రోజు పచ్చర్ల జంగిల్ క్యాంప్ లో కూడా యోగ కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని టేక్కే మార్కెట్ యార్డులో 5200 మంది ప్రభుత్వ ఉద్యోగులందరిచే థిమాటిక్ యోగాను కూడా విజయవంతంగా పూర్తి చేసామన్నారు.*
*ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పెద్ద ఎత్తున జరుపుకుంటున్న నేపథ్యంలో...జిల్లాలో 7.60 లక్షల మంది యోగా దినోత్సవంలో పాల్గొనడానికి యోగాంధ్ర యాప్ లో నమోదు చేసుకోవడం జరిగిందన్నారు. యోగాంధ్ర యాప్ లో నమోదైన వ్యక్తులు గ్రామ, వార్డు సచివాలయ, మండల, జిల్లా స్థాయిల్లో గుర్తించిన 5 వేల ప్రదేశాల్లో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇందుకోసం 5 వేల మంది యోగ శిక్షకులను తయారుచేసి వారి ద్వారా యోగాసనాలు నేర్పించడం జరుగుతోందన్నారు. మానవ దైనందిన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని వాటిని పూర్తి స్థాయిలో అధిగమించేందుకు యోగ ద్వారానే సాధ్యమై మాససిక ధైర్యం సమకూరే అవకాశం ఉంటుందన్నారు. యోగా పోటీలకు సంబంధించి గ్రామ, మండల, జిల్లా స్థాయిలో పూర్తి చేసుకొని రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారని కలెక్టర్ తెలిపారు. జిల్లా కీర్తిని రాష్ట్ర స్థాయిలో ప్రదర్శించిన బనగానపల్లె టీం వారు చేసిన యోగ స్కిట్ కు బహుమతి రావడంతో పాటు యోగ కార్యక్రమాలకు సంబంధించిన వీడియోకు ప్రధమ బహుమతి సాధించడం జరిగిందన్నారు. ఇంత పెద్ద ఎత్తున యోగ శిక్షణ ఇచ్చిన పతంజలి, రామకృష్ణ మిషన్, నేచర్ గురువులు చక్కగా యోగాలో శిక్షణ ఇచ్చిన యోగ గురువులకు, కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.*
*జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పెద్దఎత్తున నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించుకున్నామన్నారు. యోగాంధ్ర యాప్ లో నమోదు చేసుకున్న వ్యక్తులందరూ ఈ నెల 21వ తేదీన నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనాలని జెసి సూచించారు. అహోబిలంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొన్న దేవస్థాన సిబ్బందికి అధికారులకు జెసి కృతజ్ఞతలు తెలిపారు.*
*అంతకుముందు యోగా చైతన్యమండలి గురువు దామోదర్ కుమార్ రెడ్డి, వారి బృంద సభ్యులు యోగాంధ్ర కార్యక్రమంలో వృక్షాసనము, వక్రాసనము, సేతు బందాసనం, తాడాసనం, ఉత్తాన పాదాసనము, పవనముక్తాసనము, అర్థ చక్రాసనం, శలభాసనము, ఉష్టాసనం, పాదహస్తానము, దండాసనము మొదలైన ఆసనాలను వేయించారు. అలాగే కపాలభాతి, అనులోమ విలోమ, శీతలి, భ్రామరి మొదలైన విధానాలతో ప్రాణాయామం చేయించారు.*
*ఈ కార్యక్రమంలో అహోబిల దేవస్థానం సీఈఓ సౌందర్య రాజన్, ఆలయ ప్రధాన పూజారి రమేష్, నంద్యాల ఆర్డిఓ విశ్వనాధ్, డీఎంహెచ్ఓ వెంకటరమణ, ఆయుష్ సీనియర్ మెడికల్ అధికారి యశోధర, అన్ని శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు, దేవస్థాన సిబ్బంది, తదితరులు యోగాంధ్ర కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.*
*డిపిఆర్ఓ, నంద్యాల వారి ద్వారా జారీ*
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
18 Jun 2025 14:49:20
ఢిల్లీలో మంత్రి నారా లోకేష్ వెంట ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
నంద్యాల ప్రతినిధి. జూన్ 17 . (నంది పత్రిక ):ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం...
Comment List