నంద్యాలలో భారీగా బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు స్టాంపులు అమ్మకాలు. 

On

బ్లాక్ మార్కెట్లో స్టాంపులు అమ్మకానికి కర్త, కర్మ, క్రియ నంద్యాల సబ్ రిజిస్టర్ చంద్రమౌళి అంటున్న ప్రజలు.

GridArt_20250619_165520234
పల్లె వెలుగు నంద్యాల.


నంద్యాల పట్టణంలో భారీగా బ్లాక్ మార్కెట్లో స్టాంపులు అధిక ధరలకు అమ్మకాలు  జరుగుతున్నాయని, స్టాంపులు బ్లాక్ మార్కెట్లో అమ్మకాలు జరగడానికి  కర్త, కర్మ, క్రియ నంద్యాల సబ్ రిజిస్టర్ చంద్రమౌళి అంటూ ప్రజల నుండి విమర్శలు వస్తున్నాయి. నంద్యాల పట్టణంలో స్టాంపులు బ్లాక్ మార్కెట్ దంద మూడు పువ్వులు ఆరు కాయ లాగా జోరుగా కొనసాగుతుందని పలువురు చర్చించుకుంటున్నారు. నంద్యాల సబ్ రిజిస్టర్ చంద్రమౌళి తమ కార్యాలయం నుండి తమకు అనుకూలముగా ఉన్న స్టాంపు వెండర్లకు ఇష్టానుసారముగా స్టాంపులు ఇస్తూ, వాళ్లు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు అమ్మకాలు చేసి సబ్ రిజిస్టర్ చంద్రమౌళి కి కూడా పర్సంటేజ్ రూపంలో కవర్లు ఇస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. నంద్యాల పట్టణంలో ఇంత భారీగా బ్లాక్ మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్న జిల్లా  అధికారులు చూసి చూడనట్లు కళ్ళు లేని కబోది లాగా వ్యవహరిస్తున్నారని పలువురు వాపోతున్నారు. నంద్యాలలో 20 రూపాయల స్టాంపు ఏకముగా  150 రూపాయలు అమ్మకాలు జరుగుతుండడంతో ప్రజలు కంగుతిని ముక్కున వేలు వేసుకుంటున్నారు. బ్లాక్ మార్కెట్లో స్టాంపులు అధిక ధరలకు అమ్మకాలు జరుగుతున్న విషయం  అధికారులకు తెలిసిన కూడా తెలియనట్టు నటిస్తూ తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తూ తమ ఆదాయాన్ని ఎటువంటి ధోక లేకుండా వారి ఆదాయం రెండింతలు చేసుకుంటున్నారని ప్రజల నుండి గుసగుసలు వినిపిస్తున్నాయి. నంద్యాలలో బ్లాక్ మార్కెట్లో స్టాంపులు అధిగ ధరలకు జరుగుతున్న అమ్మకాలపై పర్యవేక్షించవలసిన అధికారులు పర్యవేక్షణ లోపంతో నంద్యాల పట్టణములు స్టాంపులు బ్లాక్ మార్కెట్లో జోరుగా దందా కొనసాగుతుందని పలువురు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా జిల్లా అధికారుల స్పందించి స్టాంపులు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు అమ్మకాలు చేస్తున్న స్టాంపు వెండర్లను  గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటూ, వారి లైసెన్సులు రద్దు చేయాలని పలువురు కోరుతున్నారు.


బ్లాక్ మార్కెట్లో స్టాంపులు అధిక ధరలకు అమ్మకాలకు, నాకు ఎటువంటి సంబంధం లేదు. నంద్యాల సబ్ రిజిస్టర్ చంద్రమౌళి.


నంద్యాల పట్టణంలో అధిక ధరలకు  బ్లాక్ మార్కెట్లో స్టాంపులు అమ్మకాలు జరుగుతున్న విషయం నాకు తెలియదని, బ్లాక్ మార్కెట్లో స్టాంపులు అమ్మకాలు చేస్తున్న దానికి నాకు ఎటువంటి సంబంధం లేదని నంద్యాల సబ్ రిజిస్టర్ చంద్రమౌళి తెలిపారు. నంద్యాలలో స్టాంపులు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు అమ్మకాలు జరుగుతున్న దానికి నాకు ఏమిటి సంబంధం అని, నాపై గిట్టని వారు నాపై బురద చల్లుతున్నారని నంద్యాల సబ్ రిజిస్టర్ చంద్రమౌళి అన్నారు. ఈ సందర్భముగా చంద్రమౌళి మాట్లాడుతూ నంద్యాలలో 27 మంది స్టాంపు వెండర్లు ఉన్నారని, ఉన్నవారిలో కేవలం 23 మంది ఫోర్సులో ఉన్నట్లు తెలిపారు. నంద్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వంద రూపాయలు స్టాంపులు 27/ 01/ 25 తేదీన 4000 స్టాంపులు వచ్చాయని, ఆఫీసులో 2200 స్టాంపులు ఉంచుకొని స్టాంపు వెండర్లకు 1800 స్టాంపులు ఇవ్వడం జరిగిందని అన్నారు. వచ్చిన 100 రూపాయలు స్టాంపులు 28/01/25 తేదీ నాటికి క్లియర్ చేశామని అన్నారు ‌. 20 రూపాయల స్టాంపులు 12/02/25 నాటికే అమ్మకాలు అయిపోయాయని ఇంతవరకు ఏ స్టాంపులు కార్యాలయంలో లేవని తెలిపారు. నంద్యాలలో బ్లాక్ మార్కెట్లో 20 రూపాయల స్టాంపు 150 రూపాయలకు అమ్ముతున్న విషయం తమ దృష్టికి రాలేదని, నంద్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో 12/02/25 తేదీ నాటికి ₹20 స్టాంపులు అయిపోయాయని, ఇప్పుడు అమ్మకాలు చేస్తున్న 20 రూపాయలు స్టాంపులు అమ్మకాలు చేసే స్టాంపు వెండర్లు వేరే చోటు నుండి తెచ్చి అమ్మకాలు చేస్తున్నారేమో అని తెలిపారు. నంద్యాలలో ఉన్న స్టాంపు వెండర్లు ఎవరు నాకు బంధువులు కారని, ఎవరు నాకు శత్రువులు కాదని, అందరికీ ఒకే మాదిరి సమానంగా చూస్తూ, సమానముగా స్టాంపులు ఇస్తున్నానని, స్టాంపు వెండర్లకు నేను ఎటువంటి అదనముగా స్టాంపులు ఇవ్వడం లేదని నా మీద అనవసరమైన పుకార్లు లేపుతున్నారని అన్నారు. ఏదేమైనా బ్లాక్ మార్కెట్లో స్టాంపులు అమ్మకాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని, బ్లాక్ మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్న స్టాంపులకు నాకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. ప్రజలు అధిక ధరలకు స్టాంపులు కొనుగోలు చేసిన వారు నిర్భయముగా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే వారిపై చర్యలతో పాటు వారి లైసెన్సు రద్దు చేస్తానని అన్నారు.

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News