కుక్కల నుండి పసి పిల్లల ప్రాణాలకు రక్షణ కల్పించండి - సీపీఐ.

On

IMG-20250616-WA0067
బేతంచెర్ల జూన్ 16 (నందిపత్రిక ).
బేతంచర్ల పట్టణంలో కుక్కల నుండి పసిపిల్లల ప్రాణాలను కాపాడాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) మండల కార్యదర్శి భార్గవ్.యన్నా మున్సిపల్ అధికారులను డిమాండ్ చేశారు సంఘటన తెలిసుకున్న వెంటనే సంఘటన ప్రాంతానికి వెళ్లి బాధితుడు ప్రణీత్ ని పరామర్శించి కాలనీ వాసులతో జరిగిన విషయాన్ని తెలుసుకోని అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ.... పట్టణంలోని హనుమాన్ నగర్ కాలనీలో చిన్నపిల్లాడిని కుక్కలు కరిచి చనిపోయిన సంఘటన మరువక ముందే నాలుగు రోజుల కిందట బోయపేటలోని ఆరు సంవత్సరాల చిన్న పాపని కలవడం జరిగింది, సంఘటన మరువక ముందే మళ్లీ ఈరోజు (సోమవారం)  హనుమ నగర్ కాలనీకి చెందిన రాజేష్, మౌనిక దంపతుల ప్రణీత్ రెండున్నర సంవత్సరాల వయసు గల చిన్నపిల్లాడు ఇంటి ముందే ఆడుకుంటుంటే సుమారుగా నాలుగు కుక్కలు వచ్చి దాడి చేయడం వెళ్లడంతో పిల్లవాడి అరుపులు వినపడటంతో కాలనీవాసులు కుక్కల్ని తరిమి పిల్లాడి ప్రాణాలను కాపాడడం జరిగిందని ప్రభుత్వ అధికారులు కుక్కలు నియంత్రిస్తున్నాం అని చెప్తున్నారు తప్ప పలుమార్లు సంఘటనలు జరుగుతూనే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా మున్సిపల్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి మరోమారు ఇలాంటి సంఘటనలు జరగకుండా పట్టణంలోని ప్రజలకు చిన్న పిల్లలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు మరియు కాలనీవాసులు ఉన్నారు

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News