ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్చిన నిధుల విడుదలకు సహకరించండి
ఢిల్లీలో మంత్రి నారా లోకేష్ వెంట ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
నంద్యాల ప్రతినిధి. జూన్ 17 . (నంది పత్రిక ):ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం రాష్ట్ర మంత్రి నారా లోకేష్ భారత ఉపరాష్ట్రపతి జగదీఫ్ దంఖర్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ఆహార శుద్ధి, పరిశ్రమలశాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ , కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేందర్ ప్రదాన్, కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ లను కలిశారు. మంత్రి నారా లోకేష్ వెంట కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, లోకసభ టీడీపీ ఫ్లోర్ లీడర్ లావు శ్రీకృష్ణదేవరాయులుతో పాటు టీడీపీ ఎంపీలు మాగుంట శ్రీనివాసరెడ్డి, తదితర టీడీపీ ఎంపీలు, నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి ఉన్నారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో టీడీపీ కేంద్ర మంత్రులు, టీడీపీ ఎంపీ లతో బిజీ బిజీగా పర్యటన చేసి ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్చిన నిధుల విడుదలకు సహకరించాలని కేంద్ర మంత్రులను కోరుతూ రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం ఏడాది పాలన విజయాలు, అమరావతి పనుల పురోగతిని, యువగళం పాదయాత్ర అనుభవాల పుస్తకంను మంత్రి నారా లోకేష్ ఉపరాష్ట్రపతికి అందించి వివరించినట్లు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి చెప్పారు.
Comment List