జర్నలిస్టు పిల్లల చదువులకు భరోసా
-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
నంద్యాల ప్రతినిధి. జూన్ 16 . (నంది పత్రిక ):నంద్యాల జిల్లాలో పనిచేస్తున్న పాత్రికేయుల పిల్లల చదువుకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా అన్నారు.సోమవారం నంద్యాల పట్టణంలోని నూనెపల్లిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు నిర్వహించిన పీజీఆర్ఎస్ లో ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో జర్నలిస్టుల మిత్రబృందం నంద్యాల జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్,కార్పొరేట్ పాఠశాలల్లో ఉచిత విద్య అందించాలని వినతి పత్రాన్ని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియాకు అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పాత్రికేయుల పిల్లల ఫీజు రాయితీ విషయంలో ప్రభుత్వ జిల్లా మరియు మండల విద్యాశాఖ అధికారులు మీకు సహకారం అందిస్తారని భరోసనిచ్చారు.అదే విధంగా రానున్న రోజుల్లో ఫీజు రాయితీపైన విద్యాశాఖ అధికారులు సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని జిల్లా విద్యా శాఖ అధికారి జనార్ధన్ రెడ్డిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.అనంతరం ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ జర్నలిస్టుల పిల్లల భవిష్యత్తు కోసం ఉచిత విద్య అందించాలని జిల్లా కలెక్టర్ వారిని కోరగా, సానుకూలంగా స్పందించారన్నారు.త్వరలో ఈ విషయంపైన కలెక్టర్ ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందన్నారు.జాతీయ కార్యదర్శి యలనాటి జాషువా మాట్లాడుతూ రానున్న రోజుల్లో పాత్రికేయుల సంరక్షణకు ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ పనిచేస్తుందన్నారు.కేవలం పాత్రికేయులకే కాకుండా ప్రజా సమస్యలపైన కూడా ఐరా పనిచేస్తుందని తెలిపారు.ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు లెజెండ్ శ్రీను మాట్లాడుతూ నంద్యాల జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమం, మరియు తమ హక్కుల సాధన కోసమే ఐరా పనిచేస్తుందని,రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. జర్నలిస్టుల సంక్షేమం మరియు సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఐరా పనిచేస్తుందని అన్నారు.పాఠశాలలో ఫీజులు కట్టలేని కలం వీరులకు మేమంతా అండగా ఉంటూ వారి సంక్షేమం మరియు సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐరా రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయ్ బాబు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శరత్ బాబు,జిల్లా కార్యదర్శి రంగ మరియు ఐఆర్ఏ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Comment List