కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రజల భద్రతకు బలోపేతం
-డిఎస్పీ కె ప్రమోద్ కుమార్
ఆళ్లగడ్డప్రతినిధి జూన్ 22,నంది పత్రిక:-కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ద్వారా ప్రజల భద్రతను బలోపేతం చేయడం, చట్ట వ్యతిరేక కార్య కలాపాలను అరికట్టడం, శాంతి భద్రతల పరిస్థితిని మెరుగు పరచడమే లక్ష్యం గా నిర్వహిస్తున్నామని ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ కుమార్ తెలిపారు. నంద్యాల జిల్లా ఎస్పీ అధి రాజ్ సింగ్ రానా ఆదేశాల మేరకు, ఆళ్లగడ్డ డీఎస్పీ కె. ప్రమోద్ కుమార్ పర్యవేక్షణలో, ఆళ్లగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అహోబిలం లో ఆదివారం కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ ఆళ్లగడ్డ రూరల్ సీఐ డి.మురళీధరురెడ్డి, శిరివెళ్ల సీఐ, ఏం.దస్తగిరి బాబు, చాగలమర్రి, దోర్నిపాడు, శిరివెళ్ల పోలీస్ స్టేషన్లకు చెందిన సబ్ఇన్స్పెక్టర్ల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తనిఖీలు నిర్వహించి సరైన పత్రాలు లేని 5 మోటార్ సైకిళ్లు, ఇద్దరు వ్యక్తుల వద్ద నుండి 10 లీటర్ల సారా స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. అలాగే అహోబిలం గ్రామంలోని రౌడీషీటర్లు, అనుమానితుల నివాసాల్లో పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహించారు.
Comment List