ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో శిలాఫలకం కూల్చివేత

On

IMG-20250622-WA0022

పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారులు

దర్యాప్తు చేస్తున్న పోలీసులు

భూపాలపల్లి జూన్ 21 పల్లె వెలుగు ప్రతినిధి: గణపురం మండల కేంద్రంలోని దక్షిణముగా ఆంజనేయస్వామి దేవాలయ ప్రాంగణంలో ఘనపసముద్రం సరస్సు కట్టపై ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈనెల 5న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చేతుల మీదుగా సరస్సు సుందరీకరణ కోసం పర్యాటకశాఖ ఆధ్వర్యంలో సాస్కి పథకంలో భాగంగా శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. కేవలం 15 రోజుల్లోనే శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ విషయమై సంబంధిత పర్యాటకశాఖ అధికారులు గణపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా స్థానిక ఎస్సై రేఖ అశోక్ కుమార్ ధ్వంసం చేసిన శిలాఫలకాన్ని పరిశీలించి విచారణ ప్రారంభించారు. శిలాఫల్కం ధ్వంసం విషయం మండల కేంద్రంలో చర్చనియంషంగా మారింది. శిలాఫలకం ధ్వంసం విషయమై భూపాలపల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు జిల్లా ఎస్పీతో మాట్లాడినట్లు సమాచారం.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News