మెట్ట పొలాలకు లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేయాలి...CPI-ML లిబరేషన్,MCPI(U)

On

IMG-20250616-WA0056

 ఆత్మకూర్ జూన్ 16( నంది పత్రిక)

మిడుతూరు మండలం రైతుల మెట్ట పొలాలకు లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేయాలని. సిపిఐ (ఎంఎల్) లిబరేషన్. ఎం సి పి ఐ (యు) ఆధ్వర్యంలోఆత్మకూరు ఆర్డీవో కార్యాలయం ముందర ధర్నా అనంతరం ఆర్డిఓ నాగజ్యోతికి వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నా కార్యక్రమానికి ఐసా జిల్లా కార్యదర్శి ఎస్. నాగార్జున అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగాసిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు పిక్కిలి వెంకటేశ్వర్లు,యంసిపిఐ(యు) జిల్లా కన్వీనర్ ప్రాతకోట లాజరస్ మాట్లాడుతూ

 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందర ఇచ్చిన హామీలో భాగంగా మిడుతూరు మండలం ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేయాలని మండలంలోని కడుమూరు,ఉప్పలదడియ, మాసపేట,కలమందలపాడు,పై పాలెం, మండలంలోని. మిగతా అన్ని గ్రామాల్లో ఉన్న చుక్కల భూములను రైతులు గత 100 సంవత్సరములుగా అనుభవంలో ఉన్న వారికి ఆన్లైన్లో రిజిస్టర్ చేయించాలి. ఈ పాస్ పుస్తకం మంజూరు చేయాలి. ఇళ్ల స్థలాలు లేని పేదలందరికీ పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు స్థలం కేటాయించి రూ 5,లక్షలు గృహా నిర్మాణానికి మంజూరు చేయాలి 

 రేషన్ కార్డు లేని ప్రతి ఒక్కరికి నిబంధనలతో సంబంధం లేకుండా అర్హులైన కుటుంబ సభ్యులకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలి.

నందికొట్కూరు మున్సిపాలిటీ పట్టణంలోని కర్నూల్ రోడ్డు బైరెడ్డి రాజశేఖర్ నగరులో గత 18 సంవత్సరముల నుండి నివాసమున్న నిరుపేదలందరికీ పట్టాలు మంజూరు చేసి గృహాకు రూ 5 లక్షల రూపాయలు మంజూరుచేయాలి. రైతుల చుక్కల భూములకు రద్దుచేసి ఆన్లైన్ రిజిస్టర్ జరిగే విధంగా చర్య తీసుకోవాలన్నారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు కౌలు రైతులకు బ్యాంకు రుణాలు మంజూరు చేసి పాత రుణాలను రీ షెడ్యూల్ చేయాలన్నారు. కౌలు రైతులకు తక్షణమే సి ఎల్ ఆర్ కార్డులు మంజూరు చేసి విత్తనాలు ఎరువులు అందే విధంగా చర్య తీసుకోవాలన్నారు. ఈ సమస్యల పైన ప్రభుత్వం స్పందించకపోతే రైతులందరినీ ఐక్యమత్యం చేసి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు, కాపోగు సోమన్న,ఈ నరసింహులు ఎస్ బీబి.యం సిపిఐ (యు) డివిజన్ కార్యదర్శి పి.మర్రిస్వామి,లింగాల శ్రీనివాసులు, రైతులు అబ్దుల్లాపురం, వెంకటరమణ,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News