ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలకు సిద్ధం కండి

On

IMG-20250529-WA0097

- శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించండి 

- సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరావు

 

నంద్యాల ప్రతినిధి. మే 29 . (నంది పత్రిక ):కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు సాధించేలా, ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరావు సిపిఐ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నంద్యాల జిల్లా కౌన్సిల్ సమావేశం పట్టణంలోని నేషనల్ పీజీ కళాశాలలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్. బాబాఫకృద్దీన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరావు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గసభ్యులు కే.రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముందుగా పహల్గాం దాడిలో చనిపోయిన 27 మంది పౌరులు, వీర జవాన్ మురళి నాయక్, పార్టీ నాయకులు కార్యకర్తలకు సంతాపముగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.ఈ సందర్బంగా సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరావు మాట్లాడుతూ దేశంలో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీలలో సీపీఐది 2వ పార్టీ అని,అంతటి ఘన చరిత్ర కలిగిన పార్టీకి రానున్న రోజుల్లో జరగబోయే సీపీఐ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించెందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. సీపీఐ నాయకులు, కార్యకర్తల బలిదానాల ఫలితమే నేటి ప్రజల స్వేచ్ఛ అని అన్నారు. దేశంలో నక్సలిజం మావోయిస్టులు 2026వ సంవత్సరం మార్చి నాటికి ఉండకూడదనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ, అమిత్ షా ప్రవర్తిస్తున్నారని మరి త్రిపుర, మేఘాలయలలో జరుగుతున్న తిరుగుబాట్లు ఏమిటని ఆయన ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి ఏడాది గడుస్తున్నా ఎన్నికల హామీల అమలు ఎక్కడ అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.గతంలో ఉత్తరాది ఆధిపత్యం ఏమిటని బిజెపి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే ఉత్తరాది వారికి ఊడిగం చేస్తున్నారన్నారు.సిపిఐ రాష్ట్ర కార్యవర్గసభ్యులు కె. రామాంజనేయులు మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ మూడవసారి అధికార పీఠాన్ని దక్కించుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ లను చూసుకుంటూ దేశంలో నిరంకుశత్వ పాలన సాగిస్తున్నారన్నారు. పహాల్గం ఉగ్రదాడి జరుగుతుందన్న ముందస్తు సమాచారం ఉన్నా భద్రత దళాలను ఎందుకు అప్రమత్తం చేయలేదన్నారు.పహల్గాం ఉగ్రదాడి జరిగి ఇన్ని రోజులు గడుస్తున్నా ఆ ఉగ్రవాదులను పట్టుకోవడంలో మోడీ విఫలమయ్యారన్నారు. యుద్ధం తీవ్రంగా జరుగుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు చెప్పిన మాట ప్రకారం నరేంద్ర మోడీ యుద్ధాన్ని మధ్యలో ఆపేశారని, మనపై అమెరికా పెత్తనం ఏంటని నిలదీశారు.దేశవ్యాప్తంగా కుల గణన చేయమని నరేంద్ర మోడీకి విన్నవించుకున్నా ఆర్ఎస్ఎస్ మాటలు విని నరేంద్ర మోడీ పట్టించుకోలేదన్నారు.ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నరేంద్ర మోడీ దేశంలో కుల గణన చేస్తామంటున్నారన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్. రంగనాయుడు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఎన్నికల హామీల అమలులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతంలో రెండు సెంట్లు నివాసయోగమైన స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇస్తానన్న ఎన్నికల హామీ ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా ప్రస్తుతం రెండు పథకాలను మాత్రమే అమలు చేస్తున్నారన్నారు. మిగిలిన పథకాల అమలు ఏమైందని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సిపిఐ పట్టణ కార్యదర్శి కే. ప్రసాద్ కార్యదర్శి నివేదికను ప్రవేశ పెట్టారు. ఈ సమావేశంలో ఏఐటీయూసి జిల్లా కార్యదర్శి పి సుంకయ్య, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి. సోమన్న, ఏపీ గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి మోట రాముడు, జిల్లా సమితి సభ్యులు నాగరాముడు, సంజీవులు, సుబ్బారెడ్డి, సామెల్, హరినాథ్, డి. శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, వై భార్గవ్, బాలకృష్ణ, ప్రతాప్, జిలాని బాషా, ఆళ్లగడ్డ తాలూకా కార్యదర్శి కే భాస్కర్, మహిళా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రజిత, జి. లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

నంద్యాల ప్రభుత్వ వైద్య కళాశాల అభివృద్ధికి కృషి చేయాలి  -మంత్రి ఫరూక్ నంద్యాల ప్రభుత్వ వైద్య కళాశాల అభివృద్ధికి కృషి చేయాలి -మంత్రి ఫరూక్
నంద్యాల ప్రతినిధి. మే 31 . (నంది పత్రిక ):డాక్టర్ ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ చంద్రశేఖర్ రాష్ట్ర న్యాయ,మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి...
పోలీసుల మోస్ట్ వాంటెడ్.. మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్
ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలకు సిద్ధం కండి
ఘనంగా కలశ దాతలకు మహా సంకల్పం
నర్సాపురం, ముత్తలూరు గ్రామాలలో ఎంపీడీవో భాగ్యలక్ష్మి ఆకస్మిక తనిఖీలు
తెలుగుదేశంలో కార్యకర్తే అధినేత
ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఆలపాటి సురేష్ ను నియమించడం పట్ల హర్షం