మల విసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దండి

On

IMG-20250524-WA0025

-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా*

నంద్యాల ప్రతినిధి. మే 24 . (నంది పత్రిక ):జిల్లాలో మలవిసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు విశేష కృషి జరపాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ ఛాంబర్ లో మలవిసర్జన రహిత గ్రామాలు, పారిశుద్ధ్యం పై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో డిప్యూటీ సిఈఓ సుబ్బారెడ్డి, డిపిఓ శివారెడ్డి, డిపిఆర్సి కోఆర్డినేటర్ మంజుల వాణి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ఓడిఎఫ్ ప్లస్ కింద చేపట్టి పెండింగ్లో ఉన్న 62 గ్రామాలను మల్ల విసర్జన లేని గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల వినియోగంపై సర్వే చేయించి వాటి వినియోగానికి చర్యలు తీసుకునేలా ఈఓఆర్డిలు, ఎంపిడిఓలకు ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. ప్రతి కుటుంబం నిర్మించుకున్న మరుగుదొడ్డిని ప్రతి ఒక్కరూ వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో ట్యాంకుల పరిశుభ్రత, క్లోరినేట్ చేసిన తాగునీటి సరఫరా, చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలపై సమీక్షించి ఎప్పటికప్పుడు పిఆర్ వన్ యాప్ లో నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న చెత్తాచెదారాలను తొలగించడంతోపాటు గ్రామాల్లో ఉన్న చెత్తకుప్పలను పరిశుభ్రం చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వ్యక్తిగత ఇంకుడు గుంతలు, ప్రభుత్వ/ప్రైవేటు సంస్థల ఆవరణలో కమ్యూనిటీ ఇంకుడు గుంతలతో పాటు కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ ల వివరాలు సేకరించడంతో పాటు వాటిని వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి నెల మూడో శనివారం చేపట్టే స్వర్ణాంధ్ర-స్వచ్ఛఆంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసి పరిశుభ్రత కార్యక్రమాలపై అవగాహన కల్పించాలన్నారు. సమాజంలో అన్ని వ్యాధుల వ్యాప్తికి పరిసరాల అపరిశుభ్రత కారణమని వీటి నివారణకు స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగస్వాములను చేస్తూ ముమ్మర పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News