టిడిపి నాయకులపై వైసీపీ నాయకుల దాడి
15 మంది వైసీపీ నాయకులు ఇంటిపై దాడి చేయడంతో ముగ్గురుకు తీవ్ర గాయాలు*
కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు*
పల్లె వెలుగు కర్నూలు బ్యూరో
టిడిపి నాయకులు రాజలింగం పై వైసీపీ నేతలు దాడి చేశారు. ఆదివారం సాయంత్రం కల్లూరు చెన్నమ్మ సర్కిల్ శ్రీనివాస నగర్ లో టీడీపీ నాయకుల ఇంటిపై వెళ్లి 15 మంది వైసీపీ నాయకులు మూకుముడగా దాడి చేసి గాయపరిచారు. నిద్రలో ఉన్న రామలింగను అతని భార్య, సుభద్రను, కుమారుడు వెంకటరమణాను తీవ్రంగా గాయపరిచారు. వైసీపీకి చెందిన అబ్రహం, రాంబాబు గతంలో కూడా వీరిపై దాడి చేశారని బాధితులు తెలిపారు. ఒకసారి గా 15 మంది ఇంటిపై దాడి చేయడం దారుణమన్నారు. గతంలో వారిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదయిందని తెలిపారు. రాజలింగంకు ఏడున్నర లక్ష డబ్బులు ఇవ్వాలని ఆ విషయంలో గతంలో కూడా దాడి చేశారని తెలిపారు. ఎప్పుడు టిడిపికి మద్దతు ఇచ్చినందుకే తమపై దాడి చేస్తారన్నారు. స్థానికులు 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. బాధితులు కర్నూల్ నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కర్నూలు నాలుగో పట్టణ ఎస్సై కిషోర్ కుమార్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి వారి ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేశారు.
Comment List