ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఆలపాటి సురేష్ ను నియమించడం పట్ల హర్షం
ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఆలపాటి సురేష్ ను నియమించడం పట్ల హర్షం
-ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్
నంద్యాల ప్రతినిధి. మే 27 . (నంది పత్రిక ):ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి జాషువా ఆద్వర్యంలో నంద్యాలలోని అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పాత్రికేయరంగంలో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిని రాష్ట్ర ప్రభుత్వం,సిఎం చంద్ర బాబు ఎంపిక చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు.పాత్రికేయ రంగంలో ఎంతో అనుభవం ఉన్న ఆలెపాటి సురేష్ ను నామినేటెడ్ పదవుల్లో భాగంగా ప్రెస్ అకాడమీ చైర్మన్ గా నియమించినందుకు ముందుగా సిఎం చంద్ర బాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.పాత్రికేయ రంగంలో ఉన్నత ప్రమాణాలను కాపాడడానికి జర్నలిస్టుల సంక్షేమానికి ఆలపాటి సురేష్ కృషి చేస్తారన్న విశ్వాసం ఉందని తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ఉన్నటువంటి ప్రత్యేక చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలని కోరారు.అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఇస్తున్న అక్రిడేషన్ విషయంలో చిన్న,పెద్ద పత్రికలనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్క జర్నలిస్టుకు అక్రిడేషన్ వచ్చే విధంగా చూడాలని కోరారు.అలాగే జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలిపారు.ఎన్నికల సమయంలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చి,ఇండ్లు కట్టించే ఏర్పాటు చేస్తామని సిఎం చంద్ర బాబు హామీ ఇవ్వడం జరిగిందని,దానిని ఆచరణలోకి తీసుకొచ్చే విధంగా ప్రెస్ అకాడమీ చైర్మన్ సురేష్,ముఖ్య మంత్రితో చర్చించి పాత్రికేయులకు న్యాయం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి శరత్ బాబు,రాష్ర్ట ఉపాధ్యక్షుడు విజయ్ బాబు,నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి రంగా రావు తదితరులు పాల్గొన్నారు.
Comment List