బక్రీద్ పురస్కరించుకొని హజరత్ మౌలానా యూసుఫ్ సాబ్ మస్జీద్ లో ప్రత్యేక ప్రార్ధనలు
కర్నూలు నగరం,కల్లూరు అర్బన్,31వ వార్డ్,హజరత్ మౌలానా యూసుఫ్ సాబ్ మస్జీద్ లో బక్రీద్ పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్ధనలు జరిపారు.ప్రార్థనలకు మత పెద్దలుముఫ్తి ఖలీల్ అహ్మద్ గవర్నమెంట్ ఖాజీ హజరత్ మౌలానా ఇస్మాయిల్ సాబ్,అబ్దుల్ హాక్,మస్జీద్ కమిటీ ప్రెసిడెంట్,సెక్రటరీలు ఖాసీం మియా,
ముళ్ల హుసేన్ సాహెబ్,హాజరై ప్రార్థనలు చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బక్రీద్ సందర్బంగా కర్నూలు,పాణ్యం ముస్లిం ప్రజలకు శుభాకాంక్షలు తెలియచేశారు.హజరత్ మౌలానా యూసుఫ్ సాబ్ మస్జీద్ ను జిల్లాలో అతిపెద్ద మస్జీద్ గా నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు.నిర్మాణం ప్రారంభం నుండి మస్జీద్ లో బక్రీద్, రంజాన్ వంటి పండుగలు సందర్బంగా ప్రత్యేకంగా ప్రార్థనలు జరుగుతున్నట్లు చెప్పారు.మస్జీద్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. అదేవిదంగా ముస్లిం సమాజం సైతం మస్జీద్ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అబ్దుల్ షుకూర్,అబ్దుల్ హమీద్,ఖాజామియ, మహబూబ్ బాషా,నూర్ అహమ్మద్, అబ్దుల్లా,చుట్టుపక్కల ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Comment List