సమయం 11 అయినా తెరుచుకోని సచివాలయం-2 తలుపులు

On

GridArt_20250513_204952053

*రేషన్ కార్డుల కోసం వచ్చిన ప్రజలు అధికారులు లేక వెనుదిరుగు*

రుద్రవరం ప్రతినిధి మే 13 (నంది పత్రిక):

రుద్రవరం మండల కేంద్రంలోని సచివాలయం-2 లో ఉదయం 11 గంటలయినా తలుపులు తెరవకపోవడంతో, రేషన్ కార్డుల సమస్యల పరిష్కారానికై చిన్న చిన్న పిల్లలతో వచ్చిన ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ముందుగా వచ్చిన వారు తలుపులకు తాళాలు వేసి ఉండడంతో వేణు కొంతమంది నిరాశతో వెనుదిరిగారు. ఈ నేపథ్యంలో  మహిళా పోలీసు మాత్రమే ప్రారంభంలో అక్కడకు వచ్చినట్లు గుర్తించబడింది. ఆమెను ప్రశ్నించగా, తాను కిషోరీ అభివృద్ధి కార్యక్రమం నిమిత్తంగా అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించేందుకు వెళ్ళి వచ్చినట్లు తెలిపారు.

ప్రజల ఆవేదన:
"ఇది ప్రజాసేవా కేంద్రం. ఇలాగే ఆలస్యంగా తెరిస్తే, పేద ప్రజలు ఎప్పుడు తమ సమస్యలు పరిష్కరించుకుంటారు?" అని ఓ స్థానిక మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు సేవలు అందించాల్సిన సమయంలో అధికారులు కనిపించకపోవడం పట్ల స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

సమయం 11 అయినా తెరుచుకోని సచివాలయం-2 తలుపులు సమయం 11 అయినా తెరుచుకోని సచివాలయం-2 తలుపులు
*రేషన్ కార్డుల కోసం వచ్చిన ప్రజలు అధికారులు లేక వెనుదిరుగు* రుద్రవరం ప్రతినిధి మే 13 (నంది పత్రిక): రుద్రవరం మండల కేంద్రంలోని సచివాలయం-2 లో ఉదయం...
సోమవారం సాయంత్రం నుండి కనపడుటలేదు 
బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ దాసరి పేరుతో ఇవ్వాలి.... ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ డిమాండ్
తెలుగు రాష్ట్రాలలో తగ్గిన బంగారు ధరలు....
రైల్లో అక్రమ మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్.
మండల పరిషత్ కార్యాలయంలో ఖాళీ కుర్చీలు నిదర్శనం.
రాఘవేంద్రుని చిత్రంతో చిత్ర లేఖనంలో విద్యార్థిని ప్రతిభ