ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతంతో గేదె మృతి
On
కేసముద్రం, ఏప్రిల్ 24(నంది పత్రిక): ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతంతో గేదె మృతి చెందిన ఘటన గురువారం మండలంలోని కల్వల, కొత్తూరు శివారులో చోటు చేసుకుంది. కొత్తూరు శివారు ప్రాంతంలో ప్రమాదవశాత్తు లో టెన్షన్ విద్యుత్ లైను తెగిపడగా కొత్తూరు గ్రామానికి చెందిన శీలం వెంకన్నకు చెందిన గేదె మేతకు వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై చనిపోయింది. విషయాన్ని విద్యుత్ సిబ్బందికి తెలియపరచగానే విద్యుత్ సరఫరా నిలిపివేశారు. గేదె విలువ సుమారు రూ.60 వేల వరకు ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు ప్రభుత్వాన్ని వేడుకున్నారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
13 May 2025 20:52:39
*రేషన్ కార్డుల కోసం వచ్చిన ప్రజలు అధికారులు లేక వెనుదిరుగు*
రుద్రవరం ప్రతినిధి మే 13 (నంది పత్రిక):
రుద్రవరం మండల కేంద్రంలోని సచివాలయం-2 లో ఉదయం...
Comment List