బనగానపల్లెలో టిడిపి విజయోత్సవ ర్యాలీ 

On

IMG-20250611-WA0022

మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యం లో భారీ ఎత్తున విజయోత్సవ ర్యాలీ

బహిరంగ సభ

 బనగానపల్లె జూన్ 11 నంది పత్రిక

 రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారం చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా బనగానపల్లె పట్టణంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యం లో భారీ ఎత్తున విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ముందుగా మంత్రి ఇంటి నుండి ప్రారంభమై పెట్రోల్ బంకు కూడలి వరకు కొనసాగింది అనంతరం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం వేలాదిగా తరలివచ్చిన ప్రజలను అభిమానులను కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి పై పలు అవినీతి ఆరోపణలు చేశారు గతంలో క్లాత్ మర్చెంటుకు నకిలీ పట్టా ఇప్పించి కోట్ల రూపాయలు దండుకున్నాడని, గతంలో ఉన్న ఎంపీడీవోను అవినీతి పనులకు ఉపయోగించుకొని జైలుకు వెళ్లేలా చేశాడని, 

ప్రతి కార్యక్రమంలో రామిరెడ్డి సిగ్గు శరం లేకుండా ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్నారని, ప్రభుత్వ ఆసుపత్రి గోడల నిర్మాణం జరిగింది తప్ప సరైన వసతులు లేవని అన్నారు.  

 మహిళకు అవమానం జరిగిన ప్రాంతాలు బాగుపడ్డట్టు చరిత్రలో లేదు 

  మహిళలను అవమానించిన వారు బాగుపడ్డట్టు చరిత్రలో లేదని రామాయణ మహాభారతాలే ఇందుకు నిదర్శనమని బీసీ అన్నారు. 2024 ఎన్నికలకు ముందు బనగానపల్లె పట్టణంలోని మార్కెట్ యార్డ్ దగ్గర మహిళపై దాడి చేసి అవమానించారని ఒక మహిళ అని చూడకుండా బనగానపల్లె పట్టణంలోని మార్కెట్ యార్డ్ సమీపంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బిసి ఇందిరా రెడ్డి పై

 దాడి చేయడం జరిగిందని వారు ఆనాడే రాజకీయంగా పతనం అయ్యారని ప్రజలు చర్చించుకోవడం జరిగిందని మంత్రి బీసీ గుర్తు చేశారు.బనగానపల్లె లో ఎవరు చేయలేని అభివృద్ధి చేసి చూపిస్తానన్న కాటసాని రామిరెడ్డి కి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సవాల్ చేశారు.

కోట్ల రూపాయలు సొంత నిధులు ఖర్చు పెట్టైనా సరే బనగానపల్లె నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బహిరంగ సభలో ప్రకటించారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పివి కుమార్ రెడ్డి, టంగుటూరు బాణం లక్ష్మీకాంతరెడ్డి, సీనియర్ న్యాయవాది నాగేంద్రారెడ్డి, టిడిపి యువ నాయకులు సంకేశ్వర్ రెడ్డి నారాయణరెడ్డి, అమర్నాథ్ రెడ్డి, సంగు శ్రీనివాస్ రెడ్డి, వంగల పరమేశ్వర్ రెడ్డి, అత్తర్ అన్ను, పాతపాడు మహేశ్వర్ రెడ్డి, యాగంటి పల్లె దస్తగిరి, పసుపుల షేక్షావలి, బండి మౌలిశ్వర్ రెడ్డి, కటిక వానికుంట బాలరాజు, రాయలసీమ సలాం, టిక్ టాక్ కాలాం, బుర్రానుద్దీన్, నందివర్గం ఉమామహేశ్వరరావు, జోలాపురం మదనమోహన్ రెడ్డి, క్రిష్ణగిరి రంగస్వామి, మీరాపురం భాస్కర్ రెడ్డి, బోయ వెంగన్న సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎస్సై దుగ్గిరెడ్డి, పంచాయతీరాజ్ డి నాగ శ్రీనివాసులు ఆర్డబ్ల్యూఎస్ డీఈ మధుసూదన్, సాయి కృష్ణ, అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

దొంగలించి దొరికిపోయారు. దొంగలించి దొరికిపోయారు.
  నంద్యాల జిల్లాలోని పలు ప్రాంతాలలో, విజయనగరం జిల్లాలోని, ప్రకాశం జిల్లాలోని వివిద పోలీస్ స్టేషన్ ల పరిదిలలో జరిగిన ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనము కేసులలో
మిడుతూరు వార్త సీనియర్ పాత్రికేయులు మధు
ఎన్‌.హెచ్. 340C కి చెందిన టిప్పర్ ప్రమాదంలో కార్మికుడు మృతి 
ముగిసిన కెసిఆర్ కమిషన్ విచారణ!
బనగానపల్లెలో టిడిపి విజయోత్సవ ర్యాలీ 
టిడిపి నాయకులపై వైసీపీ నాయకుల దాడి
బక్రీద్ పురస్కరించుకొని హజరత్ మౌలానా యూసుఫ్ సాబ్ మస్జీద్ లో ప్రత్యేక ప్రార్ధనలు