అవినీతి నిరోధక శాఖకు చిక్కిన ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టర్

On

IMG-20250527-WA0000

 ములుగు జిల్లా బ్యూరో( నంది పత్రిక) మే 26 :

ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్ జెక్కి అరుణ సోమవారం అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసేందుకు ఓ వ్యక్తి నుంచి రూ. 50 వేలు డిమాండ్ చేసి, రూ. 30 వేలకు ఒప్పందం కుదుర్చుకుని డాక్యుమెంట్ రైటర్ ద్వారా ఆయా నగదును స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ విడుదల చేసిన ప్రకటనలోని వివరాల ప్రకారం క్లుప్తంగా..

 

ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడులోని సర్వే నెం. 713/A2లో గల 2,700 చదరపు గజాల స్థలాన్ని గిఫ్ట్ డీడ్ చేయించుకునేందుకు ఓ వ్యక్తి సంసిద్ధమయ్యారు. అయితే ఈ గిఫ్ట్ డీడ్ చేసేందుకు ఫిర్యాదుదారుని నుంచి సబ్ రిజిస్ట్రార్ అరుణ రూ. 50 వేల మొత్తాన్ని లంచంగా డిమాండ్ చేశారు. ఈ విషయంలో డాక్యుమెంట్ రైటర్ పుచ్చకాయల వెంకటేష్ ను సబ్ రిజిస్ట్రార్ అరుణ మధ్యవర్తిగా ఎంచుకున్నారు. ఒప్పందంలో భాగంగా రూ. 30 వేల మొత్తాన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఆవరణలోనే ఫిర్యాదుదారుని కారులో డాక్యుమెంట్ రైటర్ స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.లంచం మొత్తాన్ని డాక్యుమెంట్ రైటర్ నుంచి స్వాధీనం చేసుకుని, సబ్ రిజిస్ట్రార్ అరుణను, డాక్యుమెంట్ రైటర్ వెంకటేష్ ను అరెస్ట్ చేసి వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరు పర్చినట్లు అవినీతి నిరోధక శాఖ వెల్లడించింది.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News