పర్యావరణ దినోత్సవం నిర్వహించిన అటవీ అధికారులు

On

మొక్కలు నాటిన రుద్రవరం అటవీ అధికారులు, గ్రామస్తులు

IMG-20250605-WA0057

రుద్రవరం ప్రతినిధి జూన్ 5 (నంది పత్రిక):గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లా అహోబిలంలోని రిజర్వ్ అటవీ ప్రాంతంలో భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. నంద్యాల జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ప్రాజెక్ట్ టైగర్ అనురాగ్ మీనా ఆదేశాల మేరకు, రుద్రవరం సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాసుల రెడ్డి సూచనల మేరకు, రుద్రవరం అటవీ క్షేత్రాధికారి బి. శ్రీపతి నాయుడు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అహోబిలం సెక్షన్, అహోబిలం సౌత్ బీటు, కంపార్ట్‌మెంట్ నంబర్ 421లోని బయోక్కశిల ప్రదేశానికి సమీపంలో రుద్రవరం రేంజ్ సిబ్బంది మరియు అహోబిలం గ్రామ ప్రజలు కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా శ్రీపతి నాయుడు మాట్లాడుతూ, మొక్కల ఆవశ్యకత, వన్యప్రాణుల రక్షణ, మరియు జీవవైవిధ్యం ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అహోబిలం సెక్షన్ డివైఆర్ఓ ఎస్. ముర్తుజావలి, నూతల సెక్షన్ ఆఫీసర్ ఎన్. శ్రీనివాస రెడ్డి, ఆలమూరు సెక్షన్ ఆఫీసర్ ఎస్. మక్తర్ భాషా, డి.వి. పెంట సెక్షన్ ఆఫీసర్ టి. రామకృష్ణ, డాగ్ స్క్వాడ్ ఆఫీసర్ మాబుఖాన్, అహోబిలం సౌత్ బీటు ఆఫీసర్ నాగ హుస్సేనయ్య, రేంజ్ బీట్ స్టాఫ్, మరియు చీతల్ బేస్ క్యాంప్ ప్రొటెక్షన్ వాచర్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం పర్యావరణ పరిరక్షణకు ఒక గొప్ప ముందడుగు అని అధికారులు తెలిపారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

దొంగలించి దొరికిపోయారు. దొంగలించి దొరికిపోయారు.
  నంద్యాల జిల్లాలోని పలు ప్రాంతాలలో, విజయనగరం జిల్లాలోని, ప్రకాశం జిల్లాలోని వివిద పోలీస్ స్టేషన్ ల పరిదిలలో జరిగిన ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనము కేసులలో
మిడుతూరు వార్త సీనియర్ పాత్రికేయులు మధు
ఎన్‌.హెచ్. 340C కి చెందిన టిప్పర్ ప్రమాదంలో కార్మికుడు మృతి 
ముగిసిన కెసిఆర్ కమిషన్ విచారణ!
బనగానపల్లెలో టిడిపి విజయోత్సవ ర్యాలీ 
టిడిపి నాయకులపై వైసీపీ నాయకుల దాడి
బక్రీద్ పురస్కరించుకొని హజరత్ మౌలానా యూసుఫ్ సాబ్ మస్జీద్ లో ప్రత్యేక ప్రార్ధనలు