ఎన్.హెచ్. 340C కి చెందిన టిప్పర్ ప్రమాదంలో కార్మికుడు మృతి
బాధిత కుటుంబానికి ₹50 లక్షలు నష్టపరిహారం డిమాండ్
జూపాడుబంగ్లా జూన్ 12 (నంది పత్రిక) మండలం, తర్తూరు గ్రామ అడ్డు రోడ్డు అంచు వద్ద నేషనల్ హైవే 340C పై జరిగిన రోడ్డు ప్రమాదంలో బొల్లవరం గ్రామానికి చెందిన బోయ చిన్న పక్కిరయ్య అనే కార్మికుడు దుర్మరణం చెందాడు. పిఎస్ కంపెనీ యాజమాన్యంలో లేబర్గా పని చేస్తున్న ఈయన, మిక్సింగ్ మిషన్ వద్ద విధులు నిర్వహిస్తున్న సమయంలో, ఎదురుగా వచ్చిన టిప్పర్ అతనిపై దూసుకెళ్లడంతో సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.సమాచారం అందుకున్న వెంటనే జూపాడుబంగ్లా ఎస్సై లక్ష్మీనారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.ఈ దుర్ఘటనపై స్పందించిన ప్రజాసంఘాలు, నాయకులు సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు పిక్కిలి వెంకటేశ్వర్లు
ఎం.సిపిఐ (యు) జిల్లా కన్వీనర్ పి. లాజరస్ వాల్మీకి బోయ సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుజ్జుల గౌరీశ్వర్ నాయుడు ఈ నేతలు కంపెనీ యాజమాన్యంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబానికి ₹50 లక్షల నష్టపరిహారండిమాండ్ చేశారు.నందికొట్కూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ సమక్షంలో ప్రజాసంఘాలు నిర్వహించిన ఆందోళనకు స్పందించిన రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం, కంపెనీ యాజమాన్యాన్ని చర్చలకు ఆహ్వానించారు. చర్చల అనంతరం ఒప్పందంమైన నిర్ణయాలు ఇలా ఉన్నాయి.
తక్షణమే రూ.2.5 లక్షలు మృతిని దహన సంస్కారాల ఖర్చుల కోసంబోయ పద్మావతికి అందజేయడం జరిగింది.
మరో రూ.2.5 లక్షలు వారంలో ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు.
మొత్తం రూ.15 లక్షలు (ఇన్సూరెన్స్, ప్రమాద బీమా సహా) 3 నెలల లోపు ఇవ్వడం.
ఒక కుటుంబ సభ్యుడికి ఉద్యోగావకాశంపిల్లల చదువు ఖర్చులు కంపెనీ భరిస్తుందని హామీ ఈ నిర్ణయంతో బాధిత బంధువులు, ప్రజాసంఘాలు తాత్కాలికంగా ఆందోళన విరమించారు. వారు రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం గారు, ఎస్సై లక్ష్మీనారాయణ గుజ్జుల గౌరీశ్వర నాయుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు: టిడిపి నాయకులు మాజీ కమిషనర్ ముర్తుజావలి
మాజీ మార్కెట్ యార్డ్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ నాయుడు,
లింగాల శీను,మరి స్వామి,నాగేశ్వరరావు,
బొల్లవరం రవి, తదితరులు
పాల్గొన్నారు.
Comment List