సీసీ కెమెరాలు కొన్నేళ్లుగా నిరుపయోగం.....

On


IMG-20250602-WA0075
• ఈ కథనం రాసి ఒకటిన్నర నెల కావస్తున సిసి కెమెరాల వైపు మొగ్గు చూపని నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్న పోలీసులు......
• మండలంలో కొనసాగుతున్న వరుస దొంగతనాలు.......
• పోలీసులకు సవాలుగా మారిన కేసుల ఛేదన.......
నందిపత్రిక / చాగలమర్రి న్యూస్ ;
మండల కేంద్రమైన చాగలమర్రి గ్రామంలో సీసీ కెమెరాలు అలంకారప్రాయంగా మారాయి. పోలీసులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించడంలో చూపించిన చొరవ , ఆర్భాటం వాటి నిర్వహణలో చూపించలేకపోయారు. దాదాపుగా ఈ న్యూస్ పెట్టి నెలన్నర కావస్తున్న పోలీసుల తీరు మాత్రం నిమ్మకు నేరెత్తినట్లుగా ఉంది.దీంతో అవి క్రమక్రమంగా నిరుపయోగంగా, అలంకారప్రాయంగా మారాయి. కొన్ని కెమెరాలు ఆకాశానికి , నేలకు చూడగా మరికొన్ని కెమెరాలు తుప్పుబట్టి పోయాయి. ఇంకొన్ని ఏకంగా కనుమరుగయ్యాయి. కెమెరాలకు చెందిన సెటప్‌ బాక్సులు పిట్టగూళ్లకు నిలయంగా మారాయి. అయినప్పటికీ వాటి గురించి పట్టించుకునేనాథుడే కరువయ్యాడు.ఇదే అదనుగా భావించిన దొంగలు పట్టపగలే రెచ్చిపోతున్నారు. మండలంలో పనిచేయని సీసీ కెమెరాలకు మరమ్మతులు చేయించి, ఉపయోగంలోకి తీసుకొచ్చి చోరీలు, చైన్‌ స్నాచింగ్‌లు, అసాంఘిక శక్తుల ఆగడాలు, యాక్సిడెంట్లు తదితర నేరాలను నియంత్రించేందుకు పోలీసులు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.అదే విధంగా ఈ ఏడాదికి పాఠశాలలు తెరిచే సమయంలో పిల్లలు రహదారిలో వచ్చే సమీపంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

దొంగలించి దొరికిపోయారు. దొంగలించి దొరికిపోయారు.
  నంద్యాల జిల్లాలోని పలు ప్రాంతాలలో, విజయనగరం జిల్లాలోని, ప్రకాశం జిల్లాలోని వివిద పోలీస్ స్టేషన్ ల పరిదిలలో జరిగిన ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనము కేసులలో
మిడుతూరు వార్త సీనియర్ పాత్రికేయులు మధు
ఎన్‌.హెచ్. 340C కి చెందిన టిప్పర్ ప్రమాదంలో కార్మికుడు మృతి 
ముగిసిన కెసిఆర్ కమిషన్ విచారణ!
బనగానపల్లెలో టిడిపి విజయోత్సవ ర్యాలీ 
టిడిపి నాయకులపై వైసీపీ నాయకుల దాడి
బక్రీద్ పురస్కరించుకొని హజరత్ మౌలానా యూసుఫ్ సాబ్ మస్జీద్ లో ప్రత్యేక ప్రార్ధనలు