చాక్ ఫీస్ పై స్వామి దశావతారాలు

On

చాక్ ఫీస్ పై స్వామి దశావతారాలు

-ప్రముఖ చిత్రకారుడు హంస అవార్డు గ్రహీత చింతలపల్లె కోటేష్ 

GridArt_20250109_204935959

నంద్యాల ప్రతినిధి. జనవరి 09 . (నంది పత్రిక ):నంద్యాల కు చెందిన ప్రముఖ చిత్రకారుడు హంస అవార్డు గ్రహీత చింతలపల్లె కోటేష్ వైకుంఠ ఏకాదశి ని పురస్కరించుకొని ఓకే చాక్ ఫీస్ పై ఇరువైపుల స్వామి యొక్క పది అవతారాలను వాటర్ కలర్స్ తో మైక్రో బ్రష్ ద్వారా మూడు గంటల సమయంలో వినూత్నంగా వేశారు. ఈ సందర్బంగా కోటేష్ మాట్లాడుతూ దశవతారాలు అంటే మహా విష్ణువు యొక్క పది ప్రధాన అవతారాలు. లోకంలో అధర్మం పెరిగినప్పుడు ధర్మాన్ని రక్షించడానికి, చెడును అణచి వేయడానికి, మంచిని నిలబెట్టడానికి భగవంతుడు అవతరిస్తాడు. కోటేష్ వేసిన ఈ చిత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారం, నరసింహ, వరాహ, వామన, కుర్మా, మత్స్య, పరుశురామ, రాముడు, కృష్ణుడు, కల్కి ఇలా పది అవతారాలను అద్భుతంగా వేసాడు. వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ వాకిళ్ళు తెరుచుకొని వుంటాయి. మహా విష్ణువు గరుడ వాహనం పై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శన మిస్తాడు. కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అని కూడ అంటారు. ఈ పవిత్రమైన రోజున స్వామిని దర్శనం చేసుకుంటే కష్టాలు తొలగి సుఖ శాంతులతో సంతోషంగా వుంటారు. వెంకటేశ్వర స్వామి పై వున్నా భక్తి తో ఈ చిత్రాన్ని ఇలా చాక్ ఫీస్ పై వినూత్నం వేశారు.

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

సమయం 11 అయినా తెరుచుకోని సచివాలయం-2 తలుపులు సమయం 11 అయినా తెరుచుకోని సచివాలయం-2 తలుపులు
*రేషన్ కార్డుల కోసం వచ్చిన ప్రజలు అధికారులు లేక వెనుదిరుగు* రుద్రవరం ప్రతినిధి మే 13 (నంది పత్రిక): రుద్రవరం మండల కేంద్రంలోని సచివాలయం-2 లో ఉదయం...
సోమవారం సాయంత్రం నుండి కనపడుటలేదు 
బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ దాసరి పేరుతో ఇవ్వాలి.... ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ డిమాండ్
తెలుగు రాష్ట్రాలలో తగ్గిన బంగారు ధరలు....
రైల్లో అక్రమ మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్.
మండల పరిషత్ కార్యాలయంలో ఖాళీ కుర్చీలు నిదర్శనం.
రాఘవేంద్రుని చిత్రంతో చిత్ర లేఖనంలో విద్యార్థిని ప్రతిభ