చాక్ ఫీస్ పై స్వామి దశావతారాలు

On

చాక్ ఫీస్ పై స్వామి దశావతారాలు

-ప్రముఖ చిత్రకారుడు హంస అవార్డు గ్రహీత చింతలపల్లె కోటేష్ 

GridArt_20250109_204935959

నంద్యాల ప్రతినిధి. జనవరి 09 . (నంది పత్రిక ):నంద్యాల కు చెందిన ప్రముఖ చిత్రకారుడు హంస అవార్డు గ్రహీత చింతలపల్లె కోటేష్ వైకుంఠ ఏకాదశి ని పురస్కరించుకొని ఓకే చాక్ ఫీస్ పై ఇరువైపుల స్వామి యొక్క పది అవతారాలను వాటర్ కలర్స్ తో మైక్రో బ్రష్ ద్వారా మూడు గంటల సమయంలో వినూత్నంగా వేశారు. ఈ సందర్బంగా కోటేష్ మాట్లాడుతూ దశవతారాలు అంటే మహా విష్ణువు యొక్క పది ప్రధాన అవతారాలు. లోకంలో అధర్మం పెరిగినప్పుడు ధర్మాన్ని రక్షించడానికి, చెడును అణచి వేయడానికి, మంచిని నిలబెట్టడానికి భగవంతుడు అవతరిస్తాడు. కోటేష్ వేసిన ఈ చిత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారం, నరసింహ, వరాహ, వామన, కుర్మా, మత్స్య, పరుశురామ, రాముడు, కృష్ణుడు, కల్కి ఇలా పది అవతారాలను అద్భుతంగా వేసాడు. వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ వాకిళ్ళు తెరుచుకొని వుంటాయి. మహా విష్ణువు గరుడ వాహనం పై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శన మిస్తాడు. కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అని కూడ అంటారు. ఈ పవిత్రమైన రోజున స్వామిని దర్శనం చేసుకుంటే కష్టాలు తొలగి సుఖ శాంతులతో సంతోషంగా వుంటారు. వెంకటేశ్వర స్వామి పై వున్నా భక్తి తో ఈ చిత్రాన్ని ఇలా చాక్ ఫీస్ పై వినూత్నం వేశారు.

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

రుద్రవరంలో శాకాంబరీ దేవిగా విలసిల్లిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు రుద్రవరంలో శాకాంబరీ దేవిగా విలసిల్లిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు
రుద్రవరం మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శుక్రవారం రోజున అమ్మవారు శాకాంబరీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాఢ మాసం సందర్భంగా నిర్వహించిన...
జిల్లాలో ఉపాధి హామీ ప్రగతి లక్ష్యాలను అధిగమించాలి
ఈ నెల 26న ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి నంద్యాలకు రాక
నంద్యాల డిపో నుండి అరుణాచలం కు స్పెషల్ బస్
సమాచార శాఖ డీఐపిఆర్వో గా బాధ్యతలు స్వీకరించిన సిహెచ్.పురుషోత్తం
కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రజల భద్రతకు బలోపేతం 
భవిష్యత్తు పోరాటాలకు సిద్ధం కావాలి.. సిపిఐ