స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళిక రూపొందించండి

On

స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళిక రూపొందించండి

నంద్యాల ప్రతినిధి. సెప్టెంబర్ 19 . నంది పత్రిక :కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ 2047లో భాగంగా అభివద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో స్వర్ణాంధ్ర @2047 విజన్ డాక్యుమెంట్ ను రూపొందించి నవంబరు 1వ తేదీన ఆవిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్* *వెల్లడించారు. స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు తీసుకోవాల్సిన చర్యలపై  గురువారం రాష్ట్ర సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖాధిపతులు, కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు.కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, సీపీఓ వేణుగోపాల్, ఇతర జిల్లాధికారులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ ఏడాదికి 15శాతం వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా స్వర్ణాధ్ర @2047 విజన్ ప్రణాళికను రూపొందిస్తున్నట్టు తెలిపారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిద్దడంతో పాటు 43 వేల డాలర్లకు పైగా తలసరి ఆదాయంతో కూడిన 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ గల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దే లక్ష్యంతో ఈవిజన్ డాక్యుమెంట్ ను రూపొందిస్తున్నట్టు సిఎస్ పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ ప్రాధాన్యాలైన జీరో పేదరికం, ఈజ్ ఆఫ్ లివింగ్, సామాజిక మౌలిక సదుపాయాల అభివృద్ధి, డెమోగ్రాఫిక్ మేనేజిమెంట్, డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సు వంటి గ్రోత్ వంటి జిల్లాలో ప్రాముఖ్యం కలిగిన అంశాలను దృష్టిలో ఉంచుకుని ఐదేళ్ళ విజన్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు. జిల్లా ప్రణాళిక ఆధారంగా చేసుకుని మండల స్థాయిలో  ఐదేళ్ళ విజన్ కార్యాచరణ ప్రణాళికలను సిద్దం చేయాలని చెప్పారు. అదే విధంగా ఈనెల 21 నుండి అక్టోబరు 5లోగా స్వర్ణాంధ్ర @ 2047పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు మండల,మున్సిపల్,గ్రామ పంచాయితీ స్థాయిల్లో అవగాహనా సదస్సులను నిర్వహించడం జరుగుతుందని సిఎస్ వెల్లడించారు. జిల్లా కలక్టర్ల స్థాయిలో రైతులు, ప్రముఖ వ్యక్తులు, ఇతర ప్రముఖ సంఘాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలన్నారు. జిల్లా స్థాయిలో ఎంపి, ఎంఎల్ఏ, ఎంఎల్సి తదితర ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను సిఎస్ సూచించారు. స్వర్ణాంధ్ర @2047పై విద్యార్ధుల్లో అవగాహన కల్పించేందుకు ఈనెల 21 నుండి అక్టోబరు 5వ తేదీల మధ్య వివిధ పాఠశాలల,కళాశాలల విద్యార్ధిణీ విద్యార్ధులకు వ్యాస రచన,వ్యకృత్వ తదితర పోటీలను నిర్వహించాలని జిల్లా కలక్టర్లకు సిఎస్ స్పష్టం చేశారు.అనంతరం జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో భాగంగా అన్ని శాఖల నుండి ప్రణాళికలు తెప్పించుకోవాలని సిపిఓ ను ఆదేశించారు. సెప్టెంబరు 30 నాటికి మండల వారీ ప్రణాళికలు, అక్టోబరు 15లోగా జిల్లా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.fbe0ca44-25fa-4641-90e8-07c4535d150b

Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News